`కార్తికేయ` సీక్వెల్‌కి ఆస‌క్తిక‌ర టైటిల్‌..?!

,
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌, చందు మొండేటి కాంబోలో తెర‌కెక్కిన చిత్రం కార్తికేయ. 2014లో విడుదలైన ఈ చిత్రం సూప‌ర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ చిత్రానికి నిఖిల్ సీక్వెల్ చేస్తున్న‌ సంగ‌తి తెలిసిందే. కార్తికేయ 2 వ‌ర్కింగ్ టైటిల్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. ఈ చిత్రానికి దైవం మనుష్య రూపేణా అనే ఆస‌క్తిక‌ర టైటిల్‌ను మేక‌ర్స్‌ ఎంపిక చేసిన‌ట్టు తెలుస్తోంది.

అలాగే త్వ‌ర‌లోనే టైటిల్‌పై అధికారిక ప్ర‌క‌ట‌న కూడా రానుంద‌ని తెలుస్తోంది. కాగా, క‌రోనా కార‌ణంగా నిలిచిపోయిన ఈ సినిమా షూటింగ్.. ఆగ‌స్టులో ప్రారంభం కానుంద‌ని.. యూరప్, వియత్నాంలో నెక్స్ట్ షెడ్యూల్ ప్లాన్ చేశార‌ని తెలుస్తోంది.
zd1