డైరెక్ట‌ర్‌గా ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్ కొడుకు..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన తెలుగు హిట్ మూవీలో తాత పాత్ర చేసిన బొమన్ ఇరానీ టాలీవుడ్ ప్రేక్షకులకు గుర్తుండే ఉంటాడు. తన నటనతో అందర్నీ ఆకట్టుకున్న ఈ బాలీవుడ్ యాక్టర్ కొడుకు దర్శకుడిగా మారబోతున్నాడు. కాగా… ఆయన తనయుడిని బాలీవుడ్ టాప్ డైరెక్టర్ కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరిస్తూ… దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. స్వతహాగా టాలెంటెడ్ అయిన కయోజ్ ప్రతిభకు మెచ్చి… కరణ్ జోహార్ ఆఫర్ ఇచ్చాడట.

అంతే కాకుండా తన తొలి సినిమాలోనే అందాల ముద్దు గుమ్మ, దివంగత నటి శ్రీదేవి– బోనీ కపూర్ ల ముద్దుల కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేయనుందట. ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ బాలీవుడ్ లో హిట్ అయిన దోస్తానా మూవీకి కొనసాగింపుగా దోస్తానా–2 చేస్తుంది. అనివార్య కారణాల వల్ల ఈ మూవీని తిరిగి షూట్ చేస్తున్నారని టాక్.