ఆంధ్రప్రదేశ్లోని గుంటూరుకు చెందిన శిరీష బండ్ల అంతరిక్ష వాణిజ్య యాత్రల కోసం బ్రాన్సన్ సంస్థ సిద్దం చేసిన వర్జిన్ గెలాక్టిక్ యూనిటీ అనే ప్రత్యేక వ్యోమనౌక ద్వారా అంతరిక్షంలో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. వర్జిన్ గెలాక్టిక్ ఉపాధ్యక్షురాలి హోదాలో అంతరిక్ష ప్రయాణం చేసే అవకాశాన్ని దక్కించుకుంది శిరీష బండ్ల.
అయితే ఈ విషయంపై ప్రముఖ కమెడియన్ మరియు నిర్మాత బండ్ల గణేష్.. ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డాక్టర్ మురళీధర్ బండ్ల, అనురాధ బండ్ల గార్ల కూతురు శిరీష బండ్ల జులై 11 ఉదయం 9 గంటలకు అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. మా బండ్ల కుటుంబం మరో లక్ష్యాన్ని సాధించినందుకు గర్వంగా ఉంది. శిరీషకు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశాడు.
ఇక బండ్ల గణేష్ ట్వీట్తో మరో ఆసక్తికర చర్చ మొదలైంది. శిరీష.. బండ్ల గణేశ్కు బంధువు అవుతుందా? వీరిద్దరి మధ్య రిలేష్ ఏంటీ? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి శిరీష నిజంగానే బండ్ల గణేశ్కు బంధువు అవుతుందా? లేదా అన్నది తెలియాల్సి ఉంది.