టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ లింగుసామి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ బాషల్లో రూపొందనున్న ఈ మూవీ ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లింది.
అయితే ఈ చిత్రంలో రామ్తో తలపడనున్న విలన్ ఎవరన్నది ఆసక్తికరంగా మారగా.. కోలీవుడ్ హీరో ఆర్య అంటూ ఓ ప్రచారం ఊపందుకుంది. కానీ, లేటెస్ట్ టాక్ ప్రకారం.. ఈ చిత్రంలో ఆర్య విలన్ కాదని తెలుస్తోంది. అంతేకాదు, తాజాగా మరో హీరో పేరుకు తెరపైకి వచ్చింది. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు.. టాలెంటెడ్ హీరో ఆది పినిశెట్టి.
ఈయన హీరోగానే కాకుండా.. ప్రతి నాయకుడిగానూ ప్రేక్షకులను మెప్పించాడు. గతంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన సరైనోడు మూవీలో ఆది పినిశెట్టి విలన్ పాత్ర పోషించి మంచి మార్కులు కొట్టేశాడు. అయితే ఇప్పుడు రామ్ సినిమాలో ఆది పినిశెట్టి మరోసారి విలన్గా కనిపించనున్నాడని తెలుస్తోంది. ఇక ఈ మూవీలో విలన్ పాత్ర చాలా ఢిపరెంట్గా మరియు పవర్ ఫుల్గా ఉంటుందట. అందుకే ఆది కూడా విలన్గా నటించేందుకు ఓకే చెప్పాడని ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.