నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం లవ్ స్టోరీ. టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్పై నారాయణదాస్ నారంగ్, రామ్ మోహన్ రావు నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.
ఇదిలా ఉంటే.. ఈ చిత్రం నుంచి ఆ మధ్య సారంగ దరియా లిరికల్ సాంగ్ విడుదలైన సంగతి తెలిసిందే. సాయి పల్లవి నాచురల్ అందానికి తోడు ఆమె డాన్స్ పర్ఫార్మెన్స్ ఈ పాటకు మేజర్ అట్రాక్షన్ అయ్యాయి. సంగీత దర్శకుడు పవన్ సీహెచ్ ఇచ్చిన క్యాచీ ట్యూన్, సుద్దాల అశోక్ తేజ అందించిన సాహిత్యం, ఉత్సాహంగా మంగ్లీ పాడిన తీరు సామాన్యుడిని సైతం ఆకట్టుకుంది. దీంతో ఈ సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది.
ఇప్పటీకి ఈ సాంగ్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. నెల రోజుల్లోనే 10 కోట్ల వ్యూస్ దక్కించుకొని రికార్డు సృష్టించిన ఈ సాంగ్.. అతి తక్కువ కాలంలోనే 20కోట్లకు పైగా వ్యూస్ సాధించింది. ఇక ఇప్పుడు 25 కోట్ల వ్యూస్తో ఈ సాంగ్ మరో అరుదైన ఫీట్ సాధించింది. కేవలం నాలుగు నెలల్లోనే 25 కోట్ల వ్యూస్ అంటే విశేషమనే చెప్పాలి.