బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్, దక్షిణాది స్టార్ కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ ప్రభుదేవా కాంబోలో తెరకెక్కిన చిత్రం రాధే. ఈ చిత్రంలో మేఘా ఆకాశ్, దిశాపటానీ హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల నడుమ ఓటీటీలో విడుదల చేయగా.. అట్టర్ ఫ్లాప్ అయింది. అయితే ప్లే ఫర్ వ్యూ పద్ధతిలో ఈ సినిమాను విడుదల చేయడం వల్ల భారీ కలెక్షన్స్ వచ్చాయి.
ఇక థియేటర్లు ఓపెన్ కాగానే రాధే విడుదల చేస్తామని మేకర్లు ఇది వరకే ప్రకటించారు. అయితే ప్రస్తుతం మహారాష్ట్రలో లాక్డౌన్ నిబంధనలు సడలించడంతో..50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు పునః ప్రారంభం అయ్యాయి. దీంతో చెప్పినట్టుగానే మేకర్స్ థియేటర్లో రాధేను విడుదల చేశారు. కానీ, విచిత్రంగా ఫస్ట్ డే కేవలం 84 టికెట్లు మాత్రమే అమ్ముడయ్యాట.
దాంతో రూ. 6000 మాత్రమే కలెక్షన్ వచ్చిందట. ఈ విషయం తెలుసుకున్న మేకర్స్ కంగుతిన్నారట. మరోవైపు అభిమానులు కూడా షాక్ అవుతున్నారు. దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉన్న ఓ స్టార్ హీరో సినిమాకు కేవలం 84 టికెట్లు మాత్రమే అమ్ముడవడం నిజంగా ఘోర అవమానమనే అని చెప్పుకుంటున్నారు.