విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఎఫ్ 3. గతంలో విడుదలై సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన ఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్గా ఎఫ్ 3 తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక కరోనా కారణంగా ఆగిన ఈ సినిమా షూటింగ్..త్వరలోనే ప్రారంభం కానుంది. ఇదిలా ఉండే.. ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. ఈ సినిమా ఓ స్పెషల్ సాంగ్ ఉంటుంది. ఆ స్పెషల్ సాంగ్ కోసం మేకర్స్ ప్రగ్యా జైస్వాల్ని సంప్రదించగా.. ఆమె వెంటనే గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది. ఇక మరో విషయం ఏంటంటే.. ఈ సాంగ్లో ప్రగ్యాతో పాటు మరో హీరోయిన్ సోనాల్ చౌహన్ కూడా చిందేయనున్నారట. కాగా, ప్రగ్యా ప్రస్తుతం బాలయ్య సరసన అఖండలో నటిస్తున్న సంగతి తెలిసిందే.