సంక్రాంతికి షిఫ్ట్ అయిన ప‌వ‌న్ సాలిడ్ రీమేక్‌!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో మలయాళ సూప‌ర్ హిట్ అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ ఒక‌టి. సాగర్ చంద్ర దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రంలో రానా ద‌గ్గుబాటి మ‌రో హీరోగా న‌టిస్తున్నాడు. మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు.

సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 12గా రాబోతున్న ఈ మూవీ క‌రోనా సెకెండ్ వేవ్‌కు ముందే సెట్స్ మీద‌కు వెళ్లి.. కొంత షూటింగ్ కూడా జ‌రుపుకుంది. ఇక జూలైలో మ‌ళ్లీ చిత్ర షూటింగ్ రీ స్టార్ట్ కానుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారింది.

ఈ ఏడాదే ప్రేక్షకుల ముదుకు తీసుకురావాలనుకున్న ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది సంక్రాంతికి షిఫ్ట్ చేశార‌ట మేక‌ర్స్‌. త్వరలో దీనిపై క్లారిటీ కూడా ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. మ‌రి నిజంగానే ఈ సాలిడ్ రీమేక్ సంక్రాంతికి షిఫ్ట్ అయిందా.. లేదా.. అన్న‌ది తెలియాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.