బోయ‌పాటికి బాల‌య్య గ్రీన్‌సిగ్నెల్‌..బ‌రిలోకి దిగేది అప్పుడేన‌ట‌!

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో అఖండ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ద్వారకా క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రగ్య జైస్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. శ్రీకాంత్ విల‌న్‌గా క‌నిపించ‌నున్నాడు.

అయితే ఈ సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉండ‌గా.. క‌రోనా సెకెండ్ రూపంలో విరుచుకుప‌డింది. దీంతో షూటింగ్‌కు బ్రేక్ ప‌డింది. ఇక ప్ర‌స్తుతం క‌రోనా జోరు త‌గ్గుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే చాలా సినిమాలు తిరిగి సెట్స్ పైకి చేరుకుంటున్నాయి. బాలకృష్ణ కూడా తమ సినిమా షూటింగు పనులు తిరిగి మొదలుపెట్టమని బోయపాటి సూచించార‌ట‌.

ఇక బాల‌య్య గ్రీన్ సిగ్నెల్ ఇవ్వ‌డంతో బోయ‌పాటి అఖండ షూటింగ్‌ను రీ స్టార్ట్ చేసే ప‌నుల్లో ప‌డ్డార‌ట‌. తాజా స‌మాచారం ప్ర‌కారం..జులై మొదటివారంలోనూ లేదా రెండో వారంలోనూ బాల‌య్య షూటింగ్ బ‌రిలోకి దిగ‌బోతున్నార‌ని తెలుస్తోంది.