బాలీవుడ్ భామ యామీ గౌతమ్ రీసెంట్గా డైరెక్టర్ ఆదిత్య ధర్తో మూడు ముళ్లు వేయించుకుని, ఏడడుగులు నడిచిన సంగతి తెలిసిందే. ఇరు కుటుంబాలు మరియు అత్యంత సన్నిహితుల సమక్షంలో జూన్ 4న వీరి వివాహం నిరాడంభరంగా జరిగింది.
ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపిన యామీ గౌతమ్.. పెళ్లి ఫొటోలను కూడా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.. కొత్త పెళ్లికూతురు యామీ గౌతమ్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
యామి గౌతమ్ ఫోటోను కంగనా షేర్ చేస్తూ..పెళ్లికూతురు అవ్వడం కంటే ఆడపిల్ల జీవితంలో ఏది గొప్పగా ఉండదంటూ కామెంట్ పెట్టింది. ఇక ఎప్పుడూ వివాస్పద వ్యాఖ్యలతో విరుచుకుపడే కంగనా నుంచి పాజిటివ్ వ్యాఖ్యలు రావడంతో.. ఆమె పోస్ట్ వైరల్గా మారింది.