యష్ సంచ‌ల‌న నిర్ణ‌యం..ఒక్కొక్కరికి రూ. 5000 సాయం!

సెకెండ్ వేవ్‌లో క‌రోనా ఉగ్ర‌రూపం దాల్చిన సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారిని అదుపు చేసేందుకు ప‌లు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ కూడా విధించారు. ఈ లాక్‌డౌన్ కార‌ణంగా సామాన్యుల‌తో పాటు సినీ కార్మికులు కూడా నానా తిప్పలు ప‌డుతున్నారు. ఇలాంటి క్లిష్ట ప‌రిస్థితుల్లో ప‌లువురు ప్ర‌ముఖులు త‌మ వంతు సాయం అందించేందుకు ముందుకు వ‌స్తున్నారు.

తాజాగా కోలీవుడ్ రాక్‌స్టార్ య‌ష్ ఓ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. కన్నడ సినీ పరిశ్రమలోని 21 డిపార్ట్‌మెంట్స్‌లో ఉన్న 3వేల మంది సభ్యులకు.. ఒక్కొక్కరికి రూ. 5000 చొప్పున ఆర్ధిక సహాయం అందించాల‌ని య‌ష్ నిర్ణ‌యించుకున్నారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా య‌ష్ సోషల్ మీడియా ద్వారా ప్ర‌క‌టించాడు.

ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చెల‌గాటం ఆడుతున్న క‌రోనా.. ఎంద‌రికో జీవనోపాధి లేకుండా చేస్తుంది. నా సొంత కన్నడ సినీ పరిశ్రమ కూడా ఈ మహమ్మారికి ప్రభావితమైంది. ఈ క్లిష్ట సమయంలో ఇండస్ట్రీలోని 21 విభాగాలలో ఇబ్బందులు పడుతున్న 3000 మంది సభ్యులకు.. నా సంపాదన నుంచి.. ఒక్కొక్కరికి రూ. 5000 చొప్పున వారి వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలకు పంపిస్తున్నాను. ఈ సాయం వారి కష్టాలనన్నింటినీ తీర్చలేదని తెలుసు. కానీ ఎంతో కొంత ఊరటనిస్తుంద‌ని భావిస్తున్నాన‌ని య‌ష్ పేర్కొన్నారు.