టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్లో ఒకరైన సుకుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ క్రియేటివ్ డైరెక్టర్ ప్రస్తుతం అల్లు అర్జున్తో హ్యాట్రిక్ సినిమా పుష్ప పనుల్లో బిజీగా ఉన్నాడు. అలాగే మరోవైపు తన సొంత నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లోనూ పలు చిత్రాలను నిర్మిస్తున్నాడు.
కుమారి 21 ఎఫ్, దర్శకుడు, 100% కాదల్, ఉప్పెన వంటి చిత్రాలు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్పై నిర్మించినవే. అయితే ఇప్పటి వరకు ఈ బ్యానర్ బాధ్యతలను సుకుమార్ సన్నిహితుడు ప్రసాద్ చూసుకునేవారు. కానీ, ఇటీవల ఆయన గుండెపోటుతో మరణించారు.
దీంతో సుకుమార్ తన భార్య తబితాను రంగంలోకి దింపాలని నిర్ణయించుకున్నారట. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ బాధ్యతలన్నీ తన భార్య తబితాకు అప్పగించాలని మన దర్శకుడు డిసైడ్ అయ్యారట. ఇక సుక్కూ తీసుకున్న నిర్ణయాన్ని తబితా కూడా అంగీకరించినట్టు సమాచారం. కాగా, ప్రస్తుతం సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లో నిఖిల్ 18 పేజెస్ చిత్రం రూపుదిద్దుకుంటోంది.