రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న భారీ ప్రాజెక్ట్స్లో ఆదిపురుష్ ఒకటి. రామాయణం నేపథ్యంలో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడుగా కనిపించనుండగా.. కృతి సనన్ సీతగా, బాలీవుడ్ హీరో సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా నటిస్తున్నారు.
ఇక ఈ చిత్రంలో హనుమంతుడు పాత్ర ఎవరు చేస్తున్నారన్నది ఇప్పటి వరకు చిత్ర యూనిట్ ప్రకటించలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం.. హనుమంతుడి పాత్రలో మరాఠీ నటుడు దేవదత్ నాగేను తీసుకోనున్నారని ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే సంప్రదింపులు కూడా పూర్తి అయ్యాయని.. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన కూడా రానుందని తెలుస్తోంది. కాగా, ఈ చిత్రాన్ని టీ సిరీస్ బ్యానర్పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్లు సంయుక్తంగా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే