గొంతును పెంచాల్సిందే..బాలీవుడ్ భామ నీతి వ్యాఖ్య‌లు !

ఏ విష‌యాన్ని అయినా బోల్డ్‌గా చెప్పే బాలీవుడ్ భామ భూమి ఫెడ్నేకర్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలో బిజీ బిజీగా గ‌డుపుతోంది. గత ఏడాది దుర్గామతి (అనుష్క నటించిన భాగమతి రీమేక్‌) చిత్రంతో ప్రేక్ష‌కుల‌కు ప‌ల‌క‌రించిన భూమి..మిస్టర్‌ లేలే చిత్రంలో నటిస్తోంది.

అలాగే ఆమె న‌టించిన బధాయి దో చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే.. సోష‌ల్ మీడియా ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే భూమి.. ప్రపంచ పర్వావరణ దినోత్సవం సందర్భంగా తాజాగా ఓ పోస్ట్ పెట్టింది. మన అభిప్రాయాన్ని బాహాటంగా అందరికి అర్ధమయ్యేలా వ్యక్తపరచడం చాలా ముఖ్యం. అయితే ఒక్కోసారి ఎదురుతిరిగే ఈ గొంతుకకు కొన్ని ఎదురుదెబ్బలు తగులుతాయి. కానీ మెరుగైన సమాజం కోసం మన గొంతుకను రెండింతలుగా పెంచాల్సిందే.

అలా చేస్తే కొన్ని ఇబ్బందులు సైతం ఎదురుకావచ్చు. అలాగే మనం నమ్మిన ఆలోచనలు వ్యక్తపరచడానికి కొంత ఆత్మవిశ్వాసం కూడా అవసరం. ఆత్మ‌విశ్వాసంతో మనం గట్టిగా చెప్పినప్పుడే దానికి గొప్ప శక్తి వస్తుంది. అప్పుడు మనల్ని అనుసరించే వారికి గొప్ప నమ్మకాన్ని కలిగిస్తుంది అంటూ భూమి నీతి వ్యాఖ్య‌లు చెప్పుకొచ్చింది. దీంతో ఆమె పోస్ట్ వైర‌ల్‌గా మారింది.