`అఖండ` విడుద‌ల‌పై న్యూ అప్డేట్‌..ప్లాన్ మార్చిన మేక‌ర్స్‌!

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో అఖండ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా న‌టిస్తుండ‌గా.. శ్రీ‌కాంత్ విల‌న్‌గా క‌నిపించ‌నున్నాడు. అలాగే ద్వారకా క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అయితే నిజానికి ఈ చిత్రం మేలోనే విడుద‌ల కావాల్సి ఉంది. కానీ, క‌రోనా సెకెండ్ వేవ్ అడ్డుప‌డ‌టంతో షూటింగ్ ఆగిపోయింది. విడుద‌ల‌కు కూడా బ్రేక్ ప‌డింది. దాంతో ఈ చిత్రం ద‌స‌రా బ‌రిలో దిగుతుంద‌ని అంద‌రూ భావించారు.

కానీ, తాజాగా స‌మాచారం ప్ర‌కారం.. మేక‌ర్స్ ప్లాన్ మార్చి వినాయక చతుర్థి కానుకగా అంటే.. సెప్టెంబర్ 10న అఖండ‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈలోపు సాధ్యమైనంత త్వరగా షూటింగ్‌ను పూర్తి చేయాల‌ని భావిస్తున్నార‌ట‌. కాగా, బాల‌య్య డబుల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రానికి థ‌మన్ సంగీతం స‌మ‌కూర్చుతున్నాడు.