సినీ ఇండస్ట్రీలో మ‌రో విషాదం..ఘంటసాల రెండో కుమారుడు మృతి!

తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో మ‌రో విషాదం చోటు చేసుకుంది. లెజెండ్రీ గాయ‌కుడు ఘంటసాల వెంకటేశ్వరరావు రెండో త‌న‌యుడు ఘంట‌సాల రత్నకుమార్ మృతి చెందారు. గుండెపోటుతో గురువారం ఉదయం చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరిన ర‌త్న‌కుమార్‌.. అక్క‌డే చికిత్స పొందుతూ క‌న్నుమూశారు.

డ‌బ్బిండ్ ఆర్టిస్ట్‌గా త‌న‌దైన ముద్ర వేసుకున్న ర‌త్న‌కుమార్‌.. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, సంస్కృత భాషల్లో 1090 సినిమాలకు డబ్బింగ్ చెప్పారు. ఎనిమిది గంటలపాటు ఏకధాటిగా డబ్బింగ్‌ చెప్పి ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లోనూ ఆయన స్థానం సంపాదించుకున్నారు. అలాగే మాట‌ల ర‌చ‌యిత‌గా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు.

అటువంటి వ్య‌క్తి మృతి చెంద‌డంతో సినీ ప‌రిశ్ర‌మ దిగ్భ్రాంతికి గురైంది. ప‌లువురు ప్ర‌ముఖులు ఆయ‌న మృతికి నివాళులు అర్పిస్తూ కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నారు.