మండ‌పంలో పెళ్లి..పురోహితుడు తెలివికి అంద‌రూ షాక్‌!

కంటికి క‌నిపించ‌ని క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఎప్పుడూ చూడ‌ని, ఎన్న‌డూ జ‌ర‌గ‌ని చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఓ పురోహితుడు క‌రోనా నుంచి త‌న‌ను తాను ర‌క్షించుకునేందుకు తెలివిగా కారులో ఉండే మంత్రాలు చ‌దివి.. మండ‌పంలో పెళ్లి తంతును ముగించాడు.

ఈ ఘ‌ట‌న సిద్దిపేట జిల్లా కోహెడ లో ఆదివారం చోటుచేసుకున్నది. కోహెడకు చెందిన సటికం భాగ్య- మల్లేశం దంపతుల కుమార్తె సౌమ్య వివాహం తంగళ్లపల్లికి చెందిన కృష్ణమూర్తితో స్థానిక మండ‌పంలో ఆదివారం జరిగింది.

అయితే పురోహితుడు ప్రసాద్‌రావు శర్మ.. ఈ జంట వివాహం జ‌రిపించేందుకు మండపానికి వచ్చారు. కానీ, క‌రోనా విజృంభ‌ణ కార‌ణంగా మండ‌పం బ‌య‌టే కారులో కూర్చుని మైక్ ద్వారా మంత్రాలు చ‌దివి మండ‌పంలో పెళ్లిని జ‌రిపించారు. ఇక పురోహితుడు తెలివికి షాక‌వ‌డం అక్క‌డున్న వారంద‌రి వంతు అయింది.