వివాస్పద దర్శకుడు, సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల వర్మ యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్త సాగర్ మాచనూరుతో కలిసి భారత ఓటీటీ మార్కెట్ లోకి స్పార్క్ అనే ఓటీటీ సంస్థతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇండియన్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ దావూద్ ఇబ్రహీం జీవిత కథ ఆధారంగా రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం డీ కంపెనీ ప్రసారంతో స్పార్క్ ఓటీటీ సేవలు ప్రారంభం అయ్యాయి.
అయితే మొదటి 12 గంటల్లోనే స్పార్క్ ఓటీటీ 1,21,986 సబ్ స్క్రైబెర్స్ సొంతం చేసుకుంది. దీంతో అతి తక్కువ సమయంలో అత్యధిక సబ్ స్క్రైబెర్స్ పొంది స్పార్క్ రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఈ లెక్కన చూస్తుంటే రాబోయే రోజుల్లో స్పార్క్ ఓటీటీ వరల్డ్లో ప్రభంజనం సృష్టించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.