కేజీఎఫ్ హీరోను రాజ‌కీయాల్లోకి దింపుతున్న పూరీ?!

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ ప్ర‌స్తుతం టాలీవుడ్ రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో లైగ‌ర్ అనే పాన్ ఇండియా చిత్రం చేస్తున్న సంగ‌తి తెల‌సిందే. మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో విజ‌య్ బాక్స‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు. ప్ర‌స్తుతం ఈ చిత్రం షూటింగ్ ద‌శ‌లో ఉంది.

ఇదిలా ఉంటే.. పూరీ త్వ‌ర‌లోనే కేజీఎఫ్ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న క‌న్న‌డ్ స్టార్ హీరో య‌ష్‌ను రాజ‌కీయాల్లోకి దింప‌బోతున్నాడ‌ట‌. అయితే ఇది రియ‌ల్ లైఫ్‌లో కాదు.. రీల్ లైఫ్‌లోనే. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. లైగ‌ర్ త‌ర్వాత పూరీ య‌ష్‌తో ఓ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్కించ‌నున్నాడట‌.

ఇప్ప‌టికే య‌ష్ కు పూరీ క‌థ చెప్పాడ‌ని.. అది బాగా న‌చ్చ‌డంతో వెంట‌నే ఆయ‌న గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడ‌ని తెలుస్తోంది. ఇక య‌ష్‌తో పూరీ తెర‌కెక్కించ‌బోయే చిత్రం ఓ పొలిటికల్ థ్రిల్లర్ సబ్జెక్ట్ అని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. కాగా, తెలుగు, కన్న‌డ‌తో పాటు హిందీలో కూడా ఈ సినిమా విడుద‌ల కానుంది టాక్‌. మ‌రి ఈ వార్త‌ల్లో నిజ‌మెంతో తెలియాల్సి ఉంది.