చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన చిత్రం చెక్. భవ్య క్రియేషన్స్ బ్యానర్పై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటించారు.
తన తెలివితేటలతో చిన్నచిన్న దొంగతనాలు చేసే హీరో ఉగ్రదాడి కేసులో ఎలా ఇరుక్కున్నాడనేది చెక్ కథ. ఇటీవలె థియేటర్లో విడుదలైన ఈ చిత్రం మిక్స్ట్ టాక్ సొంతం చేసుకుంది.
అయితే ఇప్పడు ఈ చిత్రం ఓటీటీ విడుదలకు సిద్ధం అవుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ సన్నెక్ట్స్లో ఈ చిత్రం మే 14న స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ విజయాన్ని సన్నెక్ట్స్ వారు అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ విడుదల చేశారు.