వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఉప్పెన సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టింది కృతి శెట్టి. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న కృతి.. తెలుగు ప్రేక్షకులరే బాగా దగ్గరైంది. ఈ క్రమంలోనే ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి.
ఈ క్రమంలోనే కృతి శెట్టి.. సూర్య, ధనుష్, నితిన్, బెల్లంకొండ గణేష్ సినిమాలతో పాటు మరోసారి వైష్ణవ్ తేజ్ సరసన నటిస్తుందంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే తాజాగా ఈ వార్తలు కేవలం పుకార్లే అని తేల్చి చెప్పింది ఈ బ్యూటీ.
ప్రస్తుతం తన చేతిలో ఉన్నవి మూడు సినిమాలు మాత్రమేనని చెప్పింది. నానితో శ్యామ్సింగరాయ్, సుధీర్ బాబుతో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, రామ్తో ఓ చిత్రం చేస్తున్నానని కృతి తెలిపింది. ఇవి తప్పా మరే ప్రాజెక్ట్కు నేను సైన్ చేయలేదని ఆమె తిలిపింది.