మ‌హేష్ బాలీవుడ్ ఎంట్రీపై కృష్ణ షాకింగ్ కామెంట్స్‌?!

టాలీవుడ్ టాప్ హీరోల్లో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఒక‌రు. పెద్ద కుటుంబం నుంచి వ‌చ్చినా.. తనదైన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసి మహేష్‌ తనకంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 30 ఏళ్లు గడుస్తోన్నా ఇప్పటికీ కుర్ర హీరోలకు గ‌ట్టి పోటీ ఇస్తూ.. వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్నాడీయ‌న‌.

ఇదిలా ఉంటే.. మ‌హేష్ బాలీవుడ్ ఎంట్రీపై ఎప్ప‌టి నుంచో ర‌క‌ర‌కాల వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. అభిమానులు కూడా మ‌హేష్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తే చూడాల‌ని ముచ్చ‌ట ప‌డుతున్నారు. అయితే మ‌హేష్‌ బాలీవుడ్ ఎంట్రీపై ఆయ‌న తండ్రి, ఒక‌ప్ప‌టి స్టార్ హీరో కృష్ణ షాకింగ్ కామెంట్స్ చేశారు. రేపు ఆయ‌న బ‌ర్త్‌డే సంద‌ర్భంగా.. తాజాగా ఓ ప్ర‌ముఖ ఛానెల్‌కు ఇంట‌ర్వ్యూలో ఇచ్చారు.

ఈ ఇండ‌ర్వ్యూలో మ‌హేష్ బాలీవుడ్ ఎంట్రీపై కృష్ణ మాట్లాడుతూ.. పాతాళభైరవి చిత్రాన్ని మొదట అతనితోనే హిందీలో తీయాలనుకున్నాం. కానీ మ‌హేష్ చేయనన్నాడు. ఇక్కడ నంబర్‌ వన్‌గా ఉండి.. హిందీలోకి వెళ్లి నలుగురిలో ఒకడిగా ఎందుకు ఉండాలనేది అతని వాదన. అందుకే నేను ఎన్నో సార్లు అడిగినా.. ఒప్పుకోలేదు. బాలీవుడ్‌కు వెళ్లటం మహేష్‌కు ఇష్టం లేదు అని చెప్పుకొచ్చారు.