వెన‌క్కి త‌గ్గిన ఎన్టీఆర్‌..నిరాశ‌లో అభిమానులు!

అతిసూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్ ప్ర‌స్తుతం దేశంలో కోర‌లు చాచిన సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా చిత్ర ప‌రిశ్ర‌మ‌లో క‌రోనా క‌ల్లోలం సృష్టిస్తోంది. క‌రోనా దెబ్బ‌కు ఇప్ప‌టికే షూటింగ్ అన్నీ ఆగిపోగా.. సినిమా విడుద‌ల‌లు కూడా వాయిదా ప‌డుతున్నారు. ఇదిలా ఉంటే.. యంగ్ ఎన్టీఆర్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అనే షోతో మరోసారి బుల్లితెరపై సందడి చేసేందుకు రెడీ అయిన సంగ‌తి తెలిసిందే.

జెమినీ టీవీలో ఈ షో ప్రసారం కానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇటీవ‌లె ప్రోమో కూడా విడుద‌ల అయింది. దీంతో ఈ షో ఎప్పుడెప్పుడు వ‌స్తుందా అని అంద‌రూ ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే తాజాగా స‌మాచారం ప్ర‌కారం.. ఈ షో ఇప్ప‌ట్లో లేన‌ట్టే అని అంటున్నారు.

మే నెల నుంచి ఈ షోను ప్ర‌సారం చేయాల‌నుకున్నారు మేక‌ర్స్‌. కానీ, క‌రోనా ఉదృతి దృష్ట్యా.. షూటింగ్‌లో పాల్గొనేందుకు ఎన్టీఆర్ వెన‌క‌డుగు వేశార‌ట‌. మేక‌ర్స్ కూడా ఈ స‌మ‌యంలో రిస్క్ చేయ‌డం మంచిది కాద‌ని భావిస్తున్నార‌ట‌. అందుకే జూన్ చివరి లేదా జూలై మొదటి వారంలో ఈ షో మొదలు పెట్టే ఆలోచ‌న‌ల్లో ఉన్నార‌ట‌. అందుకే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందుతున్నార‌ని అంటున్నారు.