బ్రేకింగ్‌: క‌రోనాతో ప్రముఖ జర్నలిస్ట్, నటుడు టీఎన్‌ఆర్ మృతి!

సెకెండ్ వేవ్‌లో దేశ‌వ్యాప్తంగా వీర విహారం చేస్తున్న క‌రోనా వైర‌స్ ఎవ‌ర్నీ వ‌దిలి పెట్ట‌డం లేదు. దొరికిన వారిని దొరికిన‌ట్టు పీల్చి పిప్పి చేసేస్తోంది. ఈ మ‌హమ్మారి దెబ్బ‌కు సామాన్యులే కాదు.. అన్ని రంగాల‌కు చెందిన వారు బ‌ల‌వుతున్నారు. తాజాగా ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్‌, న‌టుడు తుమ్మ‌ల న‌ర‌సింహారెడ్డి(టీఎన్‌ఆర్) మృతి చెందారు.

ఇటీవ‌లె క‌రోనా బారిన ప‌డ్డ టీఎన్ఆర్ కాచిగూడలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఫ్రాంక్లీ స్పీకింగ్ విత్ టీఎన్ఆర్‌ అంటూ తనదైన శైలిలో ఇంటర్వ్యూలు చేస్తూ పాపుల‌ర్ అయిన ఈయ‌నకు గత కొంతకాలంగా సినిమాల్లోనూ మంచి అవకాశాలు వస్తున్నాయి.

ఈ క్ర‌మంలోనే న‌టుడిగా కూడా ఇంట‌స్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక సూటిగా సుత్తి లేకుండా మాట్లాడే స్వభావమే ఈయన్ని చాలా మందికి దగ్గర చేసింది. అటువంటి వ్యక్తిని క‌రోనా బ‌లితీసుకోవ‌డంతో జర్నలిస్టులు, సినీ ప్రముఖులు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నారు.