నాని `శ్యామ్ సింగ‌రాయ్`కి భారీ న‌ష్టం..ఏం జ‌రిగిందంటే?

న్యాచుర‌ల్ స్టార్ నాని ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో శ్యామ్ సింగ‌రాయ్ ఒక‌టి. ట్యాక్సీవాలా ఫేమ్‌ రాహుల్ సాంకృత్యాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో సాయి ప‌ల్ల‌వి, కృతి శెట్టి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.

అయితే ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మ‌చారం ప్ర‌కారం.. ఈ చిత్రానికి భారీ న‌ష్టం వాటిల్లిన‌ట్టు తెలుస్తోంది. డిఫెరంట్ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమా ఆఖరి షెడ్యూల్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్ కోసం ఇటీవ‌లె కోల్‌కతాను తలపించేలా భారీ సెట్‌ను రూపొందించారు.

దాదాపు పది ఎకరాల విస్తీర్ణంలో రూ.6.5 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన ఈ భారీ సెట్ చూస్తే.. కోల్‌కతా హైదరాబాద్‌కు వచ్చిందా అని అనిపిస్తుందట. అయితే రీసెంట్‌గా కురిసిన వర్షాలకు, భారీ ఈదురుగాలులకు ఈ సెట్ మొతం పాడైపోయింద‌ట‌. దీంతో నిర్మాత‌ల‌కు భారీ న‌ష్టం వ‌చ్చింద‌ని.. ఇక‌ మళ్ళీ ఈ సెట్ ను పునర్నిర్మించడానికి చాలా ఖర్చు అవుతుందిద‌ని అంటున్నారు.