మ‌హిళ‌ల‌ను వాడుకుని విసిరేస్తున్నారు..విశాల్‌పై న‌టి షాకింగ్ కామెంట్స్‌!

చెన్నైలో ఉన్న పద్మశేషాద్రి బాల భవన్ (పీఎస్ బీబీ) స్కూల్ లో ఓ స్టూడెంట్‌పై కామర్స్ టీచర్ లైంగిక వేధింపులకి పాల్పడుతున్నాడని ఆరోప‌ణ‌లు రావ‌డంతో.. తీవ్ర దూమారం రేగింది. ఈ విష‌యంపైనే త‌మిళ‌, తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడైన హీరో విశాల్ స్పందిస్తూ.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆ స్కూల్‌ను మూసేయాల‌ని ట్వీట్ చేశారు.

అయితే విశాల్ ట్వీట్‌పై న‌టి అండ్ కొరియోగ్రాఫ‌ర్ గాయ‌త్రి ర‌ఘురామ్ స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. మీరు ముందు సినీ ప‌రిశ్ర‌మ‌లో జ‌రుగుతున్న లైంగిక దాడుల‌ను ఖండించండి. మీ అవ‌స‌రాల కోసం మ‌హిళ‌ల‌ను వాడుకుని విసిరేస్తున్నారు. మీ లాంటి వల్ల ఎంతో మంది మహిళలు మోసపోయారు.

అలాగే వేధింపుల కారణంగా ఎంతోమంది హీరోయిన్స్‌ పారిపోయారు. ఈ విష‌యం మీకు కూడా తెలుసు. ఇండ‌స్ట్రీలో ఇబ్బందులు పడుతున్న మ‌హిళ‌ల‌ను ఆదుకోవ‌డంలో మీ హీరోయిజాన్ని చూపించండి అని గాయ‌త్రి ర‌ఘురామ్ ట్వీట్ చేసింది. దీంతో ఈమె ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.