టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ తాజా చిత్రం రొమాంటిక్. ఈ చిత్రానికి అనిల్ పాదూరి దర్శకుడు. కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరీ కనెక్ట్స్ బ్యానర్లపై పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అయితే వాస్తవానికి ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. కానీ, కరోనా దెబ్బకు రొమాంటిక్ విడుదల వెనక్కి వెళ్తూనే ఉంది. దీంతో ఆకాష్ పూరీతో సహా మూవీ మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నాడట.
ఈ చిత్రాన్ని ఓటీటీ వేదికగా విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారట. దీంతో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాకి భారీ ఆఫర్ ఇచ్చిందని.. అన్ని కుదిరితే ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది.