డిమాండ్ పెరగటంతో ఓటిటిల పై టాప్ హీరోయిన్స్ కన్ను..!

కరోనా సెకండ్ వేవ్ వేగంగా విజృంభిస్తుంది. కిందటి సంవత్సరం లాక్ డౌన్ వచ్చినప్పటి నుండి ఓటీటీలకు డిమాండ్ పెరిగింది. దీనితో దర్శక నిర్మాతలే కాకుండా మన హీరోయిన్స్ కూడా సై అంటూ దూకుతున్నారు. దీంతో ఓటీటీలకు డిమాండ్ బాగా పెరిగింది. ఇక టాప్ హీరోయిన్స్ లో కాజల్, కీర్తి సురేశ్, తమన్నా, నయన తార, సమంత వంటి వారు ఓటీటీపై దృష్టి పెట్టారు.

కీర్తి సురేశ్ నిటించిన పెంగ్విన్, మిస్ ఇండియా డైరెక్ట్ గా ఓటీటీలోనే రిలీజ్ కాగా, కాజల్ లైవ్ టెలీకాస్ట్ అంటూ డైరెక్ట్ గా వెబ్ ఫిలిం లోనే నటించింది. తాను నటించిన హే సినామిక,ఘోస్టీ తమిళ చిత్రాలు కూడా త్వరలో ఓటీటీలోనే విడుదల కానున్నాయి. ఇక తమన్నా నటించిన 11అవర్ వెబ్ సీరీస్ ఇటీవల ఓటీటీలో విడుదల కాగా నవంబర్ స్టోరీ తమిళ సీరీస్ రిలీజ్ కి రెడీ అవుతోంది. అలాగే నయనతార నటించిన నెట్రికాన్ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఇంకా అమెజాన్ ప్రైమ్ లో సమంత నటించిన ద ఫ్యామిలీమ్యాన్2 స్ట్రీమింగ్ కి సిద్ధం అవుతోంది. ఇలా టాప్ హీరోయిన్లు అందరూ ఓటీటీ బాట పడుతున్నారు.