టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఫాల్కన్ క్రియేషన్స్ ఎల్ఎల్పీ సంస్థ నిర్మించనుంది. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ `లైగర్` చిత్రం చేస్తున్నాడు.
మరోవైపు సుకుమార్ అల్లు అర్జున్ హీరోగా `పుష్ప`ను తెరకెక్కిస్తున్నారు. వీళ్లిద్దరి కమిట్మెంట్స్ అయిన వెంటనే విజయ్ – సుకుమార్ చిత్రం ప్రారంభం అవుతుందని ప్రచారం జరిగింది. ఈ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. కానీ, గత కొంతకాలంగా ఈ సినిమాకు సంబంధిచిన వార్తలేమి బయటకు రాలేదు.
దాంతో విజయ్ సినిమా అటకెక్కింది ప్రచారం జరగడం మొదలైంది. అయితే ఈ విషయంపై సుకుమార్ క్లారిటీ ఇచ్చాడు. విజయ్తో సినిమా ఆగలేదని.. ముందుగా అనుకున్న ప్రకారమే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్తుందని స్పష్టం చేశారు. దాంతో విజయ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.