తెలంగాణలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతన్న క్రమంలో ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించింది. రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గం.ల వరకు ఈ కర్ఫ్యూ ఉంటుందని వారు చెప్పారు. కానీ కర్ఫ్యూ కారణంగా చాలా మూవీ షూటింగ్స్ వాయిదా పడ్డాయి. రజనీకాంత్ నటిస్తున్న అన్నాత్తె చిత్ర షూటింగ్కు కూడా ఇబ్బంది ఎదురైంది. ఈ క్రమంలో వారు పోలీసుల నుండి ప్రత్యేక అనుమతి కోసం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.
అన్నాత్తె చిత్ర షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. దీపావళికి సినిమాని రిలీజ్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉండగా, వీలైనంత తొందరగా చిత్రాన్ని పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీని కోసం కర్ఫ్యూ సమయంలోను షూటింగ్ చేసేందుకు ప్రత్యేక అనుమతిని కోరుతున్నారని టాక్. కళానిధి సమర్పణలో సన్ పిక్చర్స్ పతాకం పై ఈ చిత్రం నిర్మితమవుతున్నది.