ముచ్చ‌ట‌గా మూడోసారి ఆ డైరెక్ట‌ర్‌కు ర‌వితేజ గ్రీన్‌సిగ్నెల్?

`క్రాక్‌`తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న మాస్ మ‌హారాజా ర‌వితేజ ప్ర‌స్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఈ సినిమా విడుద‌ల‌కు ముందే మ‌రో కొత్త సినిమాను స్టార్ట్ చేశాడు ర‌వితేజ‌. శరత్‌ మండవని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ సినిమా చేయబోతున్నారు.

అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. ర‌వితేజ మ‌రో డైరెక్ట‌ర్‌కు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. ఇంత‌కీ ఆ ద‌ర్శ‌కుడు ఎవ‌రో కాదు హ‌రీశ్ శంక‌ర్‌. వాస్త‌వానికి రవితేజ ‘షాక్’ సినిమాతోనే హ‌రీశ్ శంక‌ర్ టాలీవుడ్‌లోకి డైరెక్ట‌ర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రం త‌ర్వాత వీరి కాంబోలో వ‌చ్చిన `మిరపకాయ్` బాగానే హిట్ అయింది. అయితే ఇప్పుడు ముచ్చ‌ట‌గా ముడోసారి వీరి కాంబో సెట్ అయిన‌ట్టు తెలుస్తోంది.

ఇప్ప‌టికే హ‌రీష్ క‌థ వినిపించ‌గా.. అది బాగా న‌చ్చ‌డంలో వెంట‌నే ర‌వితేజ ఓకే చెప్పాడ‌ట‌. కాగా, హ‌రీష్ ఇప్ప‌టికే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో సినిమా చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించాడు. కానీ, క్రిష్ .. సాగర్.కె చంద్ర దర్శకత్వంలోని సినిమాలను పూర్తిచేసిన తరువాతనే, హరీశ్ శంకర్ తో సెట్స్ పైకి పవన్ వస్తాడు. అందుకే ఈలోపు ర‌వితేజ‌తో ఓ సినిమా చేయ‌ల‌ని హ‌రీస్ ఫిక్స్ అయ్యాడ‌ట‌.