కన్నీటి పర్యంతమైన ప్రముఖ నటి..!

తెలుగు ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోయిన్స్ లో పూజా హెగ్డే కూడా ఒకరు. కెరీర్ లో ఫుల్ బిజీగా ఉన్న ఈమె ఇప్పుడు కరోనా కారణంగా కొన్ని రోజులుగా షూటింగ్స్ అన్నీ ఆపేయడంతో ఇంటి దగ్గరే ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈమెకు గుండె పగిలే వార్త ఒకటి తెలిసింది. తనకు చదువు చెప్పిన తన ఫేవరేట్ టీచర్ ఒకరు అనారోగ్యంతో చనిపోయారు. ఢిల్లీలోని మానెక్ జీ కూపర్ స్కూల్ లో చదువుకున్న పూజాకి బాగా ఇష్టమయిన టీచర్ జెసికా దరువాలా.

ఆమె చనిపోయిన విషయాన్ని తెలుసుకున్న పూజా, కన్నీటి పర్యంతమైంది. ఈ ప్రపంచం ఓ రత్నాన్ని కోల్పోయిందని , తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉండటానికి కారణం ఓ రకంగా తన టీచర్ అని కూడా చెప్పింది పూజా. తన విజయానికి కారణమైన టీచర్ మరణం తనకు తీరనిలోటు అని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది పూజా.