నిక్కీ గల్రానీ..ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. కృష్ణాష్టమి, మలుపు, మరకతమణి వంటి చిత్రాల్లో హీరోయిన్ నటించింది. ఈ చిత్రాలేవి నిక్కీకి మంచి సక్సెస్ ఇవ్వలేకపోయినా..నటన పరంగా మంచి మార్కులు పడేలా చేశాయి. అయినప్పటికీ ఇక్కడ పెద్దగా అఫర్ల రాకపోవడంతో..తమిళ, మలయాళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ వస్తోంది.
ఇదిలా ఉంటే.. నిక్కీ తాజాగా ఒకరి చేతిలో అడ్డంగా మోపసోయి ఏకంగా రూ.50 లక్షలను పోగొట్టుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలో నివాసం ఉంటున్న నిఖిల్ అనే వ్యక్తి ఓ హోటల్ ను ప్రారంభించగా, నిక్కీ రూ. 50 లక్షల వరకూ పెట్టుబడిగా పెట్టిందట. ఇందుకు ప్రతిఫలంగా తాను నెలకు రూ. 1 లక్ష ఇస్తానని నిఖిల్ హామీ ఇచ్చాదట.
కానీ, హోటల్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క పైసా కూడా నిక్కీకి ఇవ్వలేదట. పైగా ఆమె ఇన్వెస్ట్ చేసిన డబ్బులు కూడా ఎన్ని సార్లు అడిగినా తిరిగి ఇవ్వకపోవడంతో.. మోసపోయానని తెలుసుకున్న నిక్కీ తాజాగా పోలీసులను ఆశ్రయించింది. నిఖిల్పై ఫిర్యాదు చేయగా.. పోలీసులు విచారణ ప్రారంభించారు. ప్రస్తుతం ఈ విషయం బయటకు రావడంతో.. నెట్టింట్లో వైరల్గా మారింది.