అతిసూక్ష్మజీవి అయిన కరోనా వైరస్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. సెకెండ్ వేవ్ రూపంలో వేగంగా విస్తరిస్తున్న కరోనా సామాన్య ప్రజలపై మాత్రమే కాదు రాజకీయ, సినీ ప్రముఖులుపై కూడా పంజా విసురుతోంది. ఇటీవలె తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.
కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత ఆయన ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు. అక్కడే ఐసొలేషన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. అయితే తాజాగా రాపిడ్ యాంటీజెన్తో పాటు ఆర్టీపీసీఆర్ టెస్ట్లు చేశారు.
అయితే రాపిడ్ టెస్ట్లో కోవిడ్ నెగిటివ్ వచ్చింది. ఆర్టీపీసీఆర్ పరీక్షా ఫలితాలు గురువారం రానున్నాయి. ఈ విషయాన్ని వైద్యులు అధికారికంగా ప్రకటించారు. ఇక కేసీఆర్కు కరోనా నెగిటివ్ రావడంతో..ఆయన అభిమానులు మరియు టీఆర్ఎస్ నేతలు ఫుల్ ఖుషీ అవుతున్నారు.