ప్రముఖ బాలీవుడ్ సింగర్ ఉదిత్ నారాయణ్ కొడుకు, సింగర్ కమ్ టీవీ హోస్ట్ అయిన ఆదిత్య నారాయణ్ తాజాగా కొవిడ్తో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. శనివారం నాడు తనతో పాటు తన భార్య శ్వేతా అగర్వాల్కు కూడా కరోనా సోకిందని కాబ్బటి వారిద్దరూ హోమ్ క్వారంటైన్లో ఉన్నట్లు ఆదిత్య తెలిపాడు. కానీ ఇప్పుడు ఆదిత్య ఆసుపత్రిలో చేరాల్సి వచ్చినట్లు ఉదిత్ నారాయన్ అన్నారు.
తన ఆరోగ్యం బాగానే ఉందని, త్వరలోనే కోలుకుంటానని, తన ఆరోగ్యం కోసం అందరు ప్రార్థించాల్సిందిగా కోరుతూ ఆదిత్య తనకు టెక్ట్స్ మెసేజ్ పంపినట్లు ఉదిత్ నారాయణ్ తెలిపారు. ఆదిత్య భార్య శ్వేత మాత్రం ప్రస్తుతం హోమ్ క్వారంటైన్లోనే ఉంది. 33 ఏళ్ల సింగర్ అయిన ఆదిత్య నారాయణ్ ప్రస్తుతం ఇండియన్ ఐడల్ షోకు హోస్ట్గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు తనకి కరోనా బారిన పడటంతో ఆదిత్య స్థానంలో నటుడు జే భనుషాలి ఈ రియాల్టీ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు.