నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో ముచ్చటగా మూడో సారి తెరకెక్కుతున్న తాజా చిత్రం `అఖండ`. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా.. శ్రీకాంత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.
ఉగాది సందర్భంగా ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేయడంతో పాటు టీజర్ కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజర్తో బాలకృష్ణ అగ్ర హీరో రికార్డులను అధిగమిస్తూ దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే సౌత్ స్టార్ రజనీకాంత్ పేరిట ఉన్న ఓ సెన్సేషనల్ రికార్డ్ ను బాలయ్య బ్రేక్ చేసి షాకిచ్చాడు.
రజినీకాంత్ నటించిన కబాలీ టీజర్ 37 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టి చరిత్ర సృష్టించింది. అయితే అఖండ టీజర్ తాజాగా 38 మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టి.. కబాలి సినిమా టీజర్ సెట్ చేసి రికార్డ్ను బద్దలు కొట్టింది. దీంతో బాలయ్య అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.