ఏపీలో పరీక్షలపై హైకోర్టు కీలక వాఖ్యలు..?

High Court

ఏపీలో పది, ఇంటర్ పరీక్షలు ప్రభుత్వానికి పెద్ద చిక్కుముడి గా తయారయ్యాయి. పది, ఇంటర్ పరీక్షలను వాయిదా వేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ ఎలాగైనా పది, ఇంటర్ పరీక్షలను నిర్వహిస్తామని ఏపీ ప్రభుత్వం అంటోంది. ఈ క్రమంలో ఏపీలో పది, ఇంటర్ పరీక్షల పై హై కోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది.

విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, ఇది లక్షల మంది విద్యార్థుల జీవితాలకి సంబందించిన అంశమని హై కోర్టు తెలిపింది. కరోనా నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం పునరాలోచించాలని తెలిపింది. పక్క రాష్ట్రాలలో పరీక్షలు వాయిదా వేస్తే, మీరు మాత్రం ఎలా నిర్వహిస్తారని హై కోర్టు ఏపీ ప్రభుత్వాని ప్రశ్నించింది. దీని పై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ సర్కార్ ను హై కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మే 3 కు హై కోర్టు వాయిదా వేసింది.