ఆ వార్త‌ల‌పై మండిప‌డ్డ అంజ‌లి..వైర‌ల్‌గా మారిన ట్వీట్‌!

అంజ‌లి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఫొటో` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీ అడుగు పెట్టిన అంజ‌లి..`షాపింగ్‌మాల్` సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్ర‌స్తుతం ఈమె న‌టించిన తాజా చిత్రం `వ‌కీల్ సాబ్‌`. ప‌వ‌న్ హీరోగా వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో అంజ‌లి కీల‌క పాత్ర పోషించింది.

ఇదిలా ఉంటే.. గ‌త రెండు రోజులుగా అంజ‌లికి క‌రోనా సోకిందంటూ జోరుగా వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. అయితే తాజాగా ఈ వార్త‌ల‌పై స్పందిస్తూ అంజ‌లి మండిప‌డింది. తనకు కరోనా పాజిటివ్ అంటూ కొన్ని వెబ్ సైట్లలో కథనాలు వస్తున్నాయని, అవి తన దృష్టికి వచ్చాయి.. కానీ, ఆ వార్త‌ల్లో ఏ మాత్రం నిజం లేద‌ని తెలిపింది.

తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని, శ్రేయోభిలాషులు, స్నేహితులు, అభిమానులు ఆందోళన చెందవద్దని అంజ‌లి స్పష్టం చేసింది. అందరూ జాగ్రత్తలు తీసుకుంటూ సురక్షితంగా ఉండాలని అంజ‌లి ట్వీట్ చేసింది. దీంతో అంజ‌లికి క‌రోనా అంటూ వ‌స్తున్న వార్త‌లు పుకార్లే అని ఆమె ట్వీట్‌తో తేలిపోయింది.

https://twitter.com/yoursanjali/status/1380115525670301698?s=20