సూపర్ స్టార్ రజనీకాంత్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. తమిళ హీరో అయినప్పటికీ.. ఈయనకు అన్ని భాషల్లోనూ అభిమానుల్లోనూ అభిమానులు ఉన్నారు. ఒక బస్ కండక్టర్ నుంచి ప్రపంచం మొత్తం గుర్తించే స్థాయికి ఎదిగిన రజిని ఎందరికో ఆదర్శం.
అటువంటి రజనీకి తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించింది.ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రకాశ్ జావదేకర్, తన ట్విట్టర్ ఖాతాలో స్వయంగా వెల్లడిస్తూ.. `భారత సినీ రంగంలోని అత్యున్నత నటుల్లో ఒకరైన రజనీకాంత్ గారికి ఈ సంవత్సరం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందించనున్నాం.
ఓ నటుడిగా, నిర్మాతగా స్క్రీన్ రైటర్ గా చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలు నిరుపమానం. రజనీకాంత్ ను ఈ అవార్డుకు ఎంపిక చేసిన జ్యూరీ సభ్యులకు నా ధన్యవాదాలు` అని పేర్కొన్నారు. దీంతో రజనీకాంత్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతూ.. ఆయనకు విషెస్ తెలిపుతున్నారు.