తాజాగా తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్న చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు తిరుగు టపాలో ఇంటికి పంపిస్తారని అన్నారు. అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో పార్టీ ఒక్కసీటును కూడా గెలుచుకునే పరిస్థితి లేదని.. అసలు టికెట్లు ఎలా అడుగుతారని.. ఆయన నిలదీశారు. ఇక, వైసీపీ తుమ్మితే ఊడిపోయే ముక్కు అని అభివర్ణించారు. ఓకే.. చంద్రబాబు చెప్పినవే నిజమని అనుకుంటే.. వైసీపీ స్తానాన్ని భర్తీ చేసే పార్టీ ఏది? అనేది చంద్రబాబు చెప్పాల్సిన […]
Tag: YCP
ఏపీలో వినాయక చవితి రాజకీయం.. వైసీపీకి ఎఫెక్టేనా..?
అత్యంత సున్నితమైన అంశాల విషయంలో ఏ పార్టీ అయినా.. ఏ ప్రభుత్వమైనా ఆచితూచి అడుగులు వేస్తాయి. ఎందుకంటే.. ఆయా ప్రజల మనోభావాలు దెబ్బతింటే.. అది రాజకీయంగా ప్రభావం చూపిస్తుం దనే వాదన ఉంటుంది కాబట్టి. కానీ,రాష్ట్రంలో ఉన్న వైసీపీప్రభుత్వానికి ఎవరు సలహాలు ఇస్తున్నారో.. ఎవరు ఏం చెబుతున్నారో.. తెలియదు కానీ.. కీలకమైన హిందూ సామాజిక వర్గం విషయంలోప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు.. తీసుకుంటున్న నిర్ణయాలు వివాదానికి కారణంగా మారుతున్నాయి. మరో నాలుగు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి […]
వైసీపీలో అస్సలు తగ్గేదేలే అంటోన్న ఆ ఇద్దరు…!
వైసీపీలో చాలా మంది నాయకులు ఉన్నారు. అయితే.. ఎక్కువ మంది.. ఏదో ఉన్నామంటే.. ఉన్నాం.. గెలి చామంటే గెలిచాం.. అన్నట్టుగానే వున్నారు. తప్పితే.. ఎక్కడా దూకుడు ప్రదర్శించడం లేదు. అంతేకాదు.. ఒకరిద్దరు.. మాత్రం.. తమకు ప్రాధాన్యం లేనప్పుడు ఎందుకు? అనే ప్రశ్న కూడా గుప్పిస్తున్నారు. ఈ నేప థ్యంలో కొందరు మాత్రం తమకు పదవులు ఉన్నా.. లేకున్నా.. మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. వీరే.. ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన.. మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని […]
కృష్ణాలో వైసీపీకి బిగ్ షాక్… పదవికి రాజీనామా చేసిన కీలకనేత..
కృష్ణా జిల్లాలో అధికార వైసిపికి భారీ షాక్ తగిలింది. ఉయ్యూరు జడ్పీటీసీ యలమంచిలి పూర్ణిమ తన పదవికిి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని కలెక్టర్కు అందజేశారు. వైసిపి అంటేనే గ్రూప్ రాజకీయాలు అధికంగా ఉండే పార్టీ. అసలే కృష్ణా జిల్లా… ఉయ్యూరు పెనమలూరు నియోజకవర్గంలోకి వస్తుంది. వైసీపీ మాజీ మంత్రి కొలుసు పార్థసారథి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ప్రధానంగా పార్టీలో ఉన్న పెద్దల నియంతృత్వ ధోరణి నచ్చక పూర్ణిమ జడ్పిటిసి పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తుంది. […]
వైసీపీకి డేంజర్ బెల్స్.. సంక్షేమం ఓట్లు రాల్చడం కష్టమేనా?
ప్రజల మనస్తత్వం ఎలా ఉంటుంది.. అని అడిగితే.. ప్రముఖ నాయకుడు ఒకరు ఇలా అన్నారు.. “ఉగాది పచ్చడి లాంటిది“అని! ఔను.. షడ్రశోపేతమైన ఉగాది పచ్చడిలాగే ప్రజల నాడి ఉంటుందనేది నిజం. ఏ నాయకుడైనా.. ఏ పార్టీ అయినా.. అన్ని రకాలుగా.. అన్ని విధాలుగా తమను ఆదర్శిస్తుందంటనే.. ఆ పార్టీకి, ఆ నేతకు ప్రజలు జైకొడతారు. లేదు.. మేం ఒకవైపే చూస్తాం! అంటే.. ఇది వికటించే ప్రమాదమే ఎక్కువ. ఇప్పుడు ఈ విషయమే తాజాగా.. ఏపీ అధికార పార్టీ […]
మోడీతో గ్యాప్.. జగన్కు మంచిదేనా..?
ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. ప్రతి ఒక్కరిలోనూ .. ఇలాంటి సందేహమే కలుగుతోంది. ఇప్పటి వరకు గత మూడేళ్లుగా వైసీపీ ప్రభుత్వం.. ఆ పార్టీ అధినేత జగన్.. కేంద్రంలోని బీజేపికిఅన్ని విధాలా సహకారం అందిస్తున్నారు. కేంద్రం ఏం అడిగినా.. ఆయన చేస్తున్నారు. ఏది కావాలన్నా ఇస్తున్నారు. రాజ్యసభ సీటు ఇచ్చారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేస్తున్నారు. కేంద్రం తీసుకున్న అన్ని నిర్ణయాలను సమర్థించారు. ఎప్పుడు ఆపదలో ఉంటే.. అప్పుడు.. మేమున్నామంటూ.. భరోసా ఇచ్చారు. అయితే.. ఇప్పుడు అదే […]
వైసీపీలో ఈ టాప్ లీడర్ల విషయంలో జగన్ యాక్షన్ తప్పదా… దిమ్మతిరిగే షాకే..!
సీఎం జగన్ అనేక మార్లు చెవిలో ఇల్లు కట్టుకుని పోరు చేస్తున్నారు. ప్రజల మధ్య ఉండాలని.. ప్రజలతో కలవాలని, వారి కష్టాలు తెలుసుకోవాలని.. ఎమ్మెల్యేలకు సూచిస్తున్నారు. అయినప్పటికీ.. చాలా మంది ఇప్పటికీ.. ప్రజల మద్య ఉండడం లేదు. సుమారు 70 మంది మాత్రం ప్రజల మధ్య ఉంటున్నారని.. తాజా లెక్కలు తేల్చి చెబుతున్నాయి. మరి దీనిని బట్టి.. వారిని ఏం చేయాలనే ప్రశ్న సహజంగానే తెరమీదికి వచ్చింది. ఎక్కడా కూడా.. జగన్ తన […]
భూమా వారసుల విషయంలో జగన్ సైలెన్స్ వెనక ఇంత కథ నడుస్తోందా…!
రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. ఎప్పుడు ఎవరు ఎటైనా మారిపోవచ్చు. ఇప్పుడు అదే జరుగుతోందనే వాదన వినిపిస్తోంది. కర్నూలు జిల్లాలోభూమ నాగిరెడ్డి కుమార్తెలు, కుమారుడు తమను ముంచేశారని.. తమ భూములపై అప్పులు చేశారని.. తమకు తెలియకుండా.. అప్పులు తీసుకోవడం ఏంటని.. ఓవర్గం ప్రజలు లబోదిబో మంటున్నారు. దీనిపై అధికార పార్టీ నేతలను కూడా కలిసి మొరపెట్టుకున్నారు. అయితే.. వీరి ఆవేదనను.. ఆందోళనను అధికార పార్టీ నేతలు ఎవరూ పట్టించుకోలేదు. పోనీ.. అదేసమయంలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, మౌనిక, […]
జగన్ బంపర్ ఆఫర్తో… ఈ వైసీపీ ఎమ్మెల్యేలకు పండగే పండగ..!
ఎప్పుడెప్పుడా.. అని ఎదురు చూస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలకు.. ముఖ్యమంత్రి జగన్ తనను స్వయంగా కలు సుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. దీనినే వైసీపీ ఎమ్మెల్యేలు కూడా కోరుకుంటున్నారు. “ఇప్పటికే మూడేళ్లు గడిచిపోయింది. ఇప్పటి వరకు .. మా సీఎంతో నేరుగా పోయి మాట్లాడిందే లే!“ అని వైసీపీకి కరడు గట్టిన.. అభిమాని.. సీమ జిల్లాలకుచెందిన ఎమ్మెల్యే ఒకరు నేరుగానే వ్యాఖ్యానించారు. ఇక, ఇరు గు పొరుగు పార్టీల నుంచి వచ్చి.. ఎమ్మెల్యేలు అయిన వారి ఆవేదన అంతా ఇంతాకాదు. […]