రాజుగారి సర్వేలు..లగడపాటి కాదు కదా..!

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు..ఢిల్లీలో ఉంటూ ఏపీలోని అధికార వైసీపీపై ఏ స్థాయిలో ఫైర్ అవుతున్నారో అందరికీ తెలిసిందే. ప్రభుత్వం అనేక తప్పులు చేస్తుందంటూ విమర్శలు చేస్తున్నారు. తనదైన శైలిలో జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఇక టీడీపీ-జనసేనలకు అనుకూలంగా రఘురామ మాట్లాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటాయని, ఆ పొత్తులోనే తాను పోటీ చేస్తానని రాజు గారు చెప్పుకొస్తున్నారు. ఇదే క్రమంలో ఎప్పటికప్పుడు తాను సొంతంగా సర్వేలు నిర్వహిస్తున్నానని, ఆ సర్వే వివరాలని […]

గుంటూరు టీడీపీలో కన్ఫ్యూజన్..ఏ సీటు ఎవరికి?

ఉమ్మడి గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలపడుతుంది..వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఎక్కువ సీట్లు కైవసం చేసుకోవాలని టి‌డి‌పి చూస్తుంది. దీంతో గెలుపు కాస్త ఈజీ కావడంతో గుంటూరులో పలు సీట్లకు డిమాండ్ పెరిగింది. సీట్ల కోసం పోటీ పెరిగింది. ఇప్పటికే సత్తెనపల్లి, గుంటూరు వెస్ట్, తాడికొండ లాంటి సీట్లలో ఇద్దరు, ముగ్గురు నేతలు ఉన్నారు. ఇదే క్రమంలో తన వారసుడుకు సీటు ఇవ్వాలని మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ […]

కలిసొస్తేనే పొత్తులు..ఒంటరిగా వీరమరణం ఉండదా?

జనసేన అధినేత పవన్ కల్యాణ్..పొత్తులపై ఎప్పటికప్పుడు కొత్తగా స్టేట్‌మెంట్స్ ఇస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఒకోసారి ఒకోలా పొత్తుల గురించి మాట్లాడుతున్నారనే భావన వస్తుంది. ఎందుకంటే పొత్తులపై ఇప్పటికే పలురకాల స్టేట్‌మెంట్స్ ఇచ్చారు. మొదట నుంచి వైసీపీ వ్యతిరేక ఓట్లని చీలనివ్వమనే చెబుతున్నారు. అది జరగాలంటే ఖచ్చితంగా టీడీపీతోనే పొత్తు ఉండాలి..బి‌జే‌పితో పొత్తు ఉన్న ప్రయోజనం ఉండదు. ఆ విషయం పవన్‌కు తెలుసు. ఇక బి‌జే‌పితో పొత్తు ఉందని చెబుతూనే..ఆ పార్టీతో ఇంతవరకు కలిసి ఏ కార్యక్రమం చేయలేదు..అటు బి‌జే‌పి […]

బాబోయ్ ఇవేం రూల్స్..జగన్‌ మాదిరిగానే పాదయాత్ర.!

నారా లోకేష్ పాదయాత్రకు పోలీసులు అనుమతించిన విషయం తెలిసిందే. అయితే పాదయాత్రకు కఠినమైన ఆంక్షలు విధించారు. ఈ రూల్స్ తో పాదయాత్ర చేయడం కష్టమని టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. కాళ్ళు కట్టేసి ముందుకెళ్లమని చెబుతున్నట్లుగా పోలీసుల రూల్స్ ఉన్నాయని అంటున్నారు. జనవరి 27 నుంచి కుప్పంలో మొదలుకానున్న లోకేష్ పాదయాత్రకు డి‌జి‌పి పర్మిషన్ ఇచ్చి ఉంటే..రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రూల్ ఉండేది..కానీ ఎక్కడకక్కడ సబ్ డివిజన్ పరిధిలో డి‌ఎస్‌పి ద్వారా పర్మిషన్ తీసుకోవాలి. అంటే ప్రతి […]

జనసేనలోకి కన్నా ఫిక్స్..సీటు పక్కా.!

జనసేనలోకి మాజీ మంత్రి, బి‌జే‌పి సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ చేరిక దాదాపు ఖాయమైందని ప్రచారం నడుస్తున్న విషయం తెలిసిందే. ఆయన బి‌జే‌పిని వీడి జనసేనలో చేరతారని గత కొద్ది రోజులుగా ప్రచారం నడుస్తోంది. అయితే బి‌జే‌పి-జనసేన పొత్తులో ఉన్నాయి..అలాంటప్పుడు కన్నా జంపింగ్ ఉంటుందా? లేదా? అనేది సస్పెన్స్ గా మారింది. కానీ ఈ మధ్య కన్నా..సోము వీర్రాజు వైఖరిపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు..ఆయనపై తీవ్ర విమర్శలు కూడా చేశారు. ఇదే సమయంలో సోము సైతం…కన్నాపై గుర్రుగా […]

చీరాల సీటు కరణం వారసుడుకే..టీడీపీ నిలువరిస్తుందా?

మొత్తానికి చీరాల సీటు విషయంలో దాదాపు క్లారిటీ వచ్చినట్లే కనిపిస్తోంది..మొన్నటివరకు ఈ సీటు కోసం ఇటు కరణం బలరాం, అటు ఆమంచి కృష్ణ మోహన్‌ల మధ్య పోరు నడిచిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఆమంచిని పర్చూరు ఇంచార్జ్ గా పంపారు. దీంతో చీరాలలో కరణంకు రూట్ క్లియర్ అయింది. ఈ సీటుని కరణం వారసుడు వెంకటేష్‌కు ఫిక్స్ చేస్తున్నారని తెలిసింది. తాజాగా  వెంకటేష్ పేరును వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ బీదా మస్తాన్ రావు ప్రకటించారు. […]

లోకేష్ పాదయాత్రకు ఊహించని కండిషన్స్..సాధ్యమేనా?

ఎట్టకేలకు నారా లోకేష్ పాదయాత్రకు పర్మిషన్ వచ్చింది. వైసీపీ ప్రభుత్వం జీవో నెంబర్ 1 తీసుకొచ్చి..రోడ్లపై ర్యాలీలు, సభలు నిర్వహించకూడదని కండిషన్స్ పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ కండిషన్స్ కేవలం ప్రతిపక్షాలకే అని, వైసీపీకి ఈ కండిషన్స్ వర్తించడం లేదని విమర్శలు వచ్చాయి. ఇదే తరుణంలో ఈ జీవోని కొట్టేయాలని సి‌పి‌ఐ నేత రామకృష్ణ కోర్టుకు వెళ్లారు. దీనిపై విచారణ జరుగుతుంది..తుది తీర్పు మంగళవారం వస్తుంది. అయితే ఈ జీవోలో ఉన్న లాజిక్‌లతో లోకేష్ పాదయాత్రకు […]

సీమ నేతలపై కేసీఆర్ కన్ను..బీఆర్ఎస్‌లోకి లాగుతారా?

బీఆర్ఎస్ పార్టీని ఏపీలో కూడా విస్తరించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని చూస్తున్న కేసీఆర్..ఏపీపై కూడా ఎక్కువగానే ఫోకస్ చేశారు. ఇక్కడ కూడా కొంత బలం పుంజుకుంటే ఎంపీ స్థానాల్లో సత్తా చాటవచ్చు అనేది కేసీఆర్ ప్లాన్. ఇప్పటికే ఏపీ బి‌ఆర్‌ఎస్ అధ్యక్షుడుగా తోట చంద్రశేఖర్‌ని నియమించిన విషయం తెలిసిందే. ఇంకా ఏపీలో ఇంకా కొందరు నేతలని చేర్చుకోవాలని కేసీఆర్ ప్లాన్ చేశారు. ఇప్పటికే కొందరు […]

టీడీపీలోకి డీఎల్-శివారెడ్డి..సీట్లు గ్యారెంటీ?

సీఎం జగన్ సొంత జిల్లా కడపలో వైసీపీకి గట్టి షాకులు తగిలేలా ఉన్నాయి. జిల్లాలో కొందరు సీనియర్లు టీడీపీలోకి రావడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే సీనియర్ నేత డీఎల్ రవీంద్రా రెడ్డి వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇంత వరెస్ట్ ప్రభుత్వాన్ని చూడలేదంటూ ఆయన విరుచుకుపడుతున్నారు. అయితే దశాబ్దాల కాలంగా కాంగ్రెస్ లో పనిచేసిన ఆయన..మైదుకూరు నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు..ఇక 2019 ఎన్నికల్లో టీడీపీలోకి రావాలని చూశారు గాని..కుదరక వైసీపీలో […]