ఇటీవల అధికార వైసీపీలో పలు సంచలన విషయాలు తెరపైకి వస్తున్నాయి. సొంత పార్టీ ఎమ్మెల్యేలే వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. మొదట నుంచి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణరెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఇటీవల ఆ విమర్శల దాడిని మరింత పెంచారు. దీంతో ఆయనని వెంకటగిరి బాధ్యతల నుంచి తప్పించారు. దీంతో ఆనం..టీడీపీలోకి వెళ్లడానికి లైన్ క్లియర్ అయిందని అంటున్నారు. అటు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సైతం అసంతృప్తిగానే ఉన్నారు. ఈయనకు నెక్స్ట్ వైసీపీలో […]