కుక్క కాటుకి చెప్పుదెబ్బ అనే స్థాయిలో సైన్యం పాకిస్తానీ తీవ్రవాదులపై విరుచుకుపడింది. జమ్మూకాశ్మీర్లోని యురి సెక్టార్లో సైనిక శిబిరంపై దాడులు చేసి 18 మంది సైనికుల్ని తీవ్రవాదులు పొట్టనపెట్టుకోగా, భారత సైన్యం ప్రతీకారేచ్ఛతో రగిలిపోయింది. ఇంతలోనే పాకిస్తాన్ నుంచి యురి సెక్టార్ టార్గెట్గా పాక్ సైన్యం కాల్పులను ప్రారంభించింది. దాంతో భారత సైన్యం అప్రమత్తమయ్యింది. తీవ్రవాదుల్ని బోర్డర్ దాటించేందుకు పాకిస్తాన్ సైన్యం వ్యూహాత్మకంగా ఈ కాల్పులను జరుపుతుంటుంది. ఇది గ్రహించిన సైన్యం, రంగంలోకి దిగి, బోర్డర్ దాటుతున్న […]