మాజీ ఎంపీ స‌బ్బం హ‌రి మృతి..!

క‌రోనా సెకండ్ వేవ్ వేగంగా విజృంభిస్తుంది. కరోనా కారణంగా ఇప్ప‌టికే కొందరు నాయ‌కులు చనిపోయారు. ఇప్పుడు తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ చెందిన మాజీ ఎంపీ స‌బ్బం హ‌రి చనిపోయారు. ఏప్రిల్ 15వ తేదీన స‌బ్బం హ‌రికి క‌రోనా పాజిటివ్ అని నిర్ధార‌ణ అవ్వగా, ఆయన మూడు రోజుల పాటు హోం క్వారంటైన్‌లోనే ఉన్నారు. కానీ ఆ తరువాత ఆయన ఆరోగ్య ప‌రిస్థితి బాగా విష‌మించ‌డంతో, డాక్టర్స్ సలహా మేర‌కు వైజాగ్ అపోలో ఆస్ప‌త్రిలో జాయిన్ అయ్యి, చికిత్స పొందుతున్నారు. […]

ఏపీలో కర్ఫ్యూ.. ఎప్పటి నుంచి అంటే..?

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి. కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తున్న తరుణంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒక ముఖ్య నిర్ణయం తీసుకుంది. ఈ నెల 5వ తారీఖు నుండి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు దుకాణాలకు మాత్రం పర్మిషన్ ఇచ్చింది. ఆ తర్వాత కూడా కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. రెండు వారాల వరుకు ఈ కర్ఫ్యూ నిబంధనలు అమల్లో ఉంటుంది. ఎవరైనా కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే వారి […]

కొత్త పార్టీ స్థాప‌న‌..క్లారిటీ ఇచ్చేసిన ఈటల!

ప్ర‌జ‌ల భూముల‌ను కబ్జా చేశార‌ని తెలంగాణ వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి ఈట‌ల రాజేందర్‌ను సీఎం కేసీఆర్ రాష్ట్ర మంత్రివర్గ శాఖ నుంచి తొలిగించిన సంగ‌తి తెలిసిందే. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం హకీంపేట, అచ్చంపేట గ్రామాల్లో భూముల కబ్జా జరిగినట్టు దర్యాప్తు కమిటీ నిగ్గు తేల్చింది. దాంతో వెంట‌నే ఆయ‌న‌ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయ‌డంతో తెలంగాణ రాజ‌కీయాలు వేడెక్కాయి. అయితే ఈటల మాత్రం అచితూచి అడుగులు వేస్తున్నారు. తన వెంట కలిసొచ్చే నేతలతో సమాలోచనలు చేస్తున్నారు. […]

బ్రేకింగ్ : తమిళనాడు సీఎం రాజీనామా..!?

తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కే పళనిస్వామి కొద్దిసేపటి క్రితం తన పదవికి రాజీనామా చేశారు. నిన్న జరిగిన ఓట్ల లెక్కింపు తరువాత, అన్నాడీఎంకే ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సేలంలో ఉన్న ఆయన, తన కార్యదర్శి ద్వారా రాజీనామా లేఖను పంపించారని, గవర్నర్ కార్యాలయానికి ఈ లేఖ మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో చేరుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా మాట్లాడిన పళనిస్వామి, స్టాలిన్ కు అభినందనలు తెలిపారు. ఆ వెంటనే స్టాలిన్ కూడా స్పందించారు. ఈ […]

`రాధే శ్యామ్` రిలీజ్‌కు ముందే ప్ర‌భాస్ స‌రికొత్త రికార్డ్‌!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో రాధే శ్యామ్ ఒక‌టి. రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది. గోపీకృష్ణ మూవీస్‌తో పాటు యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్యాన్ ఇండియన్ స్థాయిలోనే ఈ చిత్రం కూడా వస్తుంది. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం జూలై 30న విడుదల కానుంది. అయితే ఈ చిత్రం రిలీజ్‌కు ముందే ప్ర‌భాస్ ఓ స‌రికొత్త రికార్డు క్రియేట్ […]

బిజినెస్ మెన్‌తో పెళ్ళికి సిద్ధమైన త్రిష‌..త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న‌?!

త్రిష‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం ఇలా అన్ని భాష‌ల్లోనూ న‌టించి.. త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది ఈ బ్యూటీ. కెరీర్‌ తొలినాళ్ల‌లో ఎన్నో సూపర్‌ హిట్లు దక్కించుకున్న త్రిష‌కు ప్రస్తుతం అవ‌కాశాలు స‌న్న‌గిల్లాయి. ఇదిలా ఉంటే.. త్రిష ఎప్పుడెప్పుడు పెళ్లీ పీట‌లెక్క‌బోతుందా అని అంద‌రూ ఎప్ప‌టి నుంచో ఎదురు చూస్తున్నారు. ఇప్ప‌టికే త్రిష పెళ్లిపై అనేక వార్త‌లు రాగా.. అవ‌న్నీ పుకార్లే అని తేలిపోయాయి. అయితే […]

మ‌హేష్‌తో రొమాన్స్ చేయ‌బోతున్న హీరోయిన్‌ కూతురు?

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ చిత్రం షూటింగ్ ద‌శ‌లో ఉంది. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. అయితే ఈ చిత్రం త‌ర్వాత మ‌హేష్ త‌న త‌దుప‌రి చిత్రాన్ని మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్‌తో ఉంటుంద‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మితం కానుంది. వ‌చ్చే ఏడాది విడుద‌ల […]

తెలంగాణ‌లో కొత్త‌గా 5,695 క‌రోనా కేసులు..రిక‌వ‌రీ ఎంతంటే?

చైనాలో పుట్టిన క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల‌ను కుదిపేస్తున్న సంగ‌తి తెలిసిందే. కంటికి క‌నిపించ‌కుండా క‌ల్లోలం సృష్టిస్తున్న ఈ ప్రాణాంత‌క వైర‌స్‌.. ప్ర‌స్తుతం మ‌ళ్లీ శ‌ర వేగంగా విజృభిస్తోంది. దీంతో అన్ని దేశాల్లో, రాష్ట్రాల్లో క‌రోనా పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు భారీగా న‌మోదు అవుతున్నాయి. తెలంగాణ‌లోనూ నిన్న స్వ‌ల్పంగా క‌రోనా కేసులు తగ్గాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 5,695 పాజిటివ్ కేసులు […]

భార‌త్‌లో స్వ‌ల్పంగా త‌గ్గిన క‌రోనా కేసులు..తాజా లెక్క ఇదే!

ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వాల‌కు మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. ప్ర‌స్తుతం శ‌ర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ.. క‌రోనా జోరు ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. భార‌త్‌లో కూడా క‌రోనా కేసులు భారీగా న‌మోదు అవుతున్నాయి గత 24 గంటల్లో భారత్‌లో 3,68,147 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసుల‌తో దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,99,25,604 కు చేరుకుంది. అలాగే నిన్న 3,417 మంది […]