ఏ క్షణంలోనైనా కూలిపోనున్న ప‌ళ‌నిస్వామి ప్రభుత్వం

ఏమంటా త‌మిళ‌నాడు దివంగ‌త మాజీ సీఎం జ‌య‌ల‌లిత మృతిచెందారో అప్ప‌టి నుంచి త‌మిళ రాజ‌కీయం ఊర‌స‌వెల్లి రంగులు మార్చిన‌ట్టు మారిపోతోంది. జ‌య మృతి త‌ర్వాత ప‌న్నీరుసెల్వం సీఎం అవ్వ‌డం ఆ త‌ర్వాత ఎడ‌ప్ప‌డి ప‌ళ‌నిస్వామి సీఎం అవ్వ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. వాస్త‌వానికి జ‌య మృతి త‌ర్వాత ప‌ళ‌నిస్వామి సీఎం అయిన‌ప్ప‌టి నుంచి పార్టీని త‌న చేతుల్లోకి తీసుకునేందుకు చిన్న‌మ్మ శ‌శిక‌ళ తీవ్ర ప్ర‌య‌త్నాలు చేసింది. చివ‌ర‌కు ఆమె అనూహ్యంగా జైలుకు వెళ్ల‌డంతో ఆమె అనుంగు అనుచ‌రుడు ప‌ళ‌నిస్వామి […]

కేటీఆర్ కేబినెట్‌లో మంత్రిగా క‌విత‌..!

తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె నిజామాబాద్ ఎంపీగా పార్ల‌మెంటులో తెలంగాణ వాణి బ‌లంగానే వినిపిస్తున్నారు. ఓ లేడీ అయ్యి ఉండి తెలంగాణ ఎదుర్కొంటోన్న స‌మ‌స్య‌ల‌పై ఆమె లోక్‌స‌భ‌లో త‌న వాగ్దాటిని బ‌లంగానే వినిపిస్తున్నార‌న్న చ‌ర్చ‌లు కూడా టీ పాలిటిక్స్‌లో వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే క‌విత‌కు కేంద్ర మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌ని దాదాపు యేడాది కాలంగా ఒక్క‌టే ప్ర‌చారం జ‌రిగింది. టీఆర్ఎస్ ఎన్డీయేలో చేరుతుంద‌ని…మోడీ టీఆర్ఎస్‌కు రెండు మంత్రి ప‌ద‌వులు కూడా ఆఫ‌ర్ చేశార‌ని..అందులో ఒక‌టి క‌విత‌కేన‌న్న ప్ర‌చారం […]

అమ్మ వార‌సుడు ఉన్నాడా ..? ఆస్తులు నాకే సొంతం

మొన్న‌టికి మొన్న `మెగాస్టార్ చిరంజీవి కొడుకును నేను` అని ఒక వ్య‌క్తి సృష్టించిన హ‌ల్ చ‌ల్ అంతా ఇంతా కాదు!! ఇప్పుడు తమిళ‌నాడు మాజీ సీఎం జ‌య‌ల‌లిత విష‌యంలోనూ ఇదే సీన్ రిపీట్ అవుతోంది. త‌మిళ‌నాడు రాజ‌కీయాలు సాధార‌ణ స్థితికి చేరుకుంటున్నాయి. కానీ ఉరుము లేని పిడుగులా వ‌స్తున్న `నేను అమ్మ కూతురిని` అని మొన్ననే ఒక యువ‌తి హ‌ల్‌చ‌ల్ చేసింది. ఇప్పుడు `నేను అమ్మ కొడుకుని` అంటూ మ‌రో వ్య‌క్తి తెర‌పైకి వ‌చ్చాడు! ఇన్నాళ్లూ ఎందుకు […]

హైకమాండ్‌కు చేరిన టీ కాంగ్రెస్ పంచాయితీ

తెలంగాణ కాంగ్రెస్‌లో వ‌ర్గ‌పోరు ముదిరిపోయింది. తెలంగాణ ఇచ్చిన పార్టీ అయినా అధికారంలోకి రాలేక‌పోయినందుకు ఒక‌ప‌క్క హైక‌మాండ్ తీవ్ర మ‌థ‌న‌ప‌డుతుంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిచి కొంత‌వ‌ర‌కైనా స్వాంత‌న చేకూర్చాల‌నే అభిప్రాయం ఏ ఒక్క‌రిలోనూ క‌నిపించ‌డంలేదు. ఆధిప‌త్య పోరుతో నాయ‌కులు.. ఒక‌డుగు ముందుకు వంద‌డుగులు వెనక్కి వేస్తున్నారు. క‌ల‌సిక‌ట్టుగా పార్టీని ముందుకు తీసుకెళ్ల‌డం మాని,,ఎవరికి వారు త‌మ స్వలాభాన్ని చూసుకుంట‌న్నారు. ముఖ్యంగా పీసీపీ చీఫ్ ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి, మాజీమంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి వ్య‌వ‌హారం ఇప్పుడు పార్టీలో తీవ్ర చ‌ర్చ‌నీయాంశమ‌వుతోంది. దీంతో […]

ఆ ఈక్వేష‌న్స్‌కు బ‌లైన ప‌న్నీరు సెల్వం

కొద్ది రోజుల క్రితం త‌మిళ‌నాడులో చెల‌రేగిన జ‌ల్లిక‌ట్టు వివాదం కేంద్రం దిగి రావ‌డంతో తెర‌ప‌డింది. ఆ త‌ర్వాత అక్క‌డ స్టార్ట్ అయిన పొలిటిక‌ల్ జల్లికట్టులో చివ‌రి గెలుపు ఎడప్పాడి పళని స్వామి (ఈపీఎస్‌)ని వ‌రిస్తే… ఓ.పన్నీరు సెల్వం (ఓపీఎస్‌) ప‌రాజితుడు అవ్వాల్సి వ‌చ్చింది. దీంతో ఇప్పుడు త‌మిళ జ‌నాలంద‌రూ పాపం ఓపీఎస్ అని అంటున్నారు. ఇక గ‌తంలోనే రెండుసార్లు అమ్మ జ‌య‌ల‌లిత జైలుకు వెళ్ల‌డంతో సీఎం అయిన ప‌న్నీరు సీఎం అయ్యి కొద్ది కాలానికే తిరిగి అమ్మ‌కోసం […]

2019లో సీఎం సీటు కోసం ప‌వ‌న్ ప్లాన్స్ ఇవే

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. 2019లో ఎన్నిక‌ల బ‌రిలోకి దిగ‌డం ఖాయ‌మైపోయింది! ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా ప్ర‌క‌టించేశాడు కూడా. అంతేకాదు, తాను ఎక్క‌డి నుంచి పోటీ చేసేదీ కూడా చెప్పేశాడు. ఇక‌, ఈ నేప‌థ్యంలో పార్టీని బ‌లోపేతం చేయ‌డం, పార్టీని సంస్థాగ‌తంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకుపోవ‌డం వంటివి కొత్త‌గా ఏర్పాటైన పార్టీ అధినేత‌లు చేప‌ట్టే కార్య‌క్ర‌మాలు. కానీ, వీటికి విరుద్ధంగా ప‌వ‌న్ ఈ విష‌యాల‌ను ప‌క్క‌న పెట్టిన‌ట్టు క‌నిపిస్తోంది. అయితే, పార్టీని ఏమ‌న్నా గాలికి వ‌ద‌లిసేడా? అంటే […]

త‌మిళ‌నాడు కొత్త సీఎం గురించి షాకింగ్ సీక్రెట్స్‌

తమిళనాడు ముఖ్యమంత్రి ఎవరు అవుతారనే విషయంపై సస్పెన్స్ కొనసాగుతోంది. అసెంబ్లీలో బలనిరూపణకు ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి ప‌న్నీర్ సెల్వంకు అవ‌కాశం ఇస్తారా ? లేదా అన్నాడీఎంకే శాస‌న‌స‌భా ప‌క్ష‌నేత శ‌శిక‌ళ స్థానంలో ఎంపికైన ప‌ళ‌నిస్వామిని ఆహ్వానిస్తారా ? అన్న‌ది ప‌క్క‌న పెడితే ప్ర‌స్తుతం త‌మిళ‌నాడు అసెంబ్లీలో 234 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. జయలలిత మరణంతో ఓ స్థానం ఖాళీ ఏర్పడింది. ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీలో అధికార అన్నాడీఎంకేకు 135 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన డీఎంకేకు 89 […]

శ‌శిక‌ళ‌కు నాలుగేళ్ల జైలు శిక్ష‌…సీఎం రేసులో దీప‌క్‌

త‌మిళ‌నాడు సీఎం అయ్యేందుకు జ‌య నెచ్చెలి శశిక‌ళ గ‌త కొద్ది రోజులుగా వేస్తోన్న ఎత్తులు, ప‌న్నుతున్న వ్యూహాలు మామూలుగా లేవు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేల‌ను సీక్రెట్‌గా బీచ్ రిసార్ట్స్‌లో ఉంచి శిబిరం నిర్వ‌హిస్తున్నారు. అయితే ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో సీఎం అవ్వాల‌ని క‌ల‌లు కంటోన్న శశికళ ఆశలన్నీ అడియాసలయ్యాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వీకే శశికళను దోషిగా సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్ణయించింది. ఈ కేసులో శ‌శిక‌ళ‌తో పాటు మరో ముగ్గురిని కూడా దోషులుగా సుప్రీంకోర్టు […]

ప‌న్నీర్ వ‌ర్గంపై వేటుకు శ‌శిక‌ళ వ్యూహం

త‌మిళ రాజ‌కీయాలు అనూహ్య మ‌లుపులు తిరుగుతున్నాయి! అన్నాడీఎంకే పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శ‌శిక‌ళ, జ‌య న‌మ్మిన‌బంటు, ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి ప‌న్నీర్ సెల్వానికి మ‌ధ్య పోరు తీవ్ర‌మవుతోంది. రోజులు గ‌డిచే కొద్దీ పన్నీర్ సెల్వానికి మ‌ద్ద‌తు పెరుగుతుండ‌టంతో శ‌శి శిబిరంలో అల‌జ‌డి రేగింది. అయితే ప‌న్నీర్ వ‌ర్గానికి అసెంబ్లీలో బ‌ల‌నిరూప‌ణ‌కు అవ‌కాశం ఇస్తే ఏమిట‌న్న విష‌యంపై శ‌శిక‌ళ మంత‌నాలు జ‌రుపుతున్నారు. ఒక‌వేళ త‌న వ‌ర్గ ఎమ్మెల్యేలు.. త‌న‌కు వ్య‌తిరేకంగా ఓటు వేస్తే వారిపై వేటు వేసేందుకు శ‌శిక‌ళ‌ సిద్ధ‌మ‌వుతున్నారు. […]