టీడీపీ మాజీ మంత్రిని వెంటాడుతోన్న వైసీపీ.. ఇంత టార్గెట్ ఎందుకు..!

టీడీపీ నాయ‌కుడు, మాజీ మంత్రి పొంగూరు నారాయ‌ణ‌పై అదే క‌సి.. అదే రాజ‌కీయం.. !! ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వం నారాయ‌ణ‌పై అదే దూకుడుగా ముందుకు సాగుతోంది. రాజ‌ధాని అమ‌రావ‌తిలో భూముల విష యంపై ఇప్ప‌టికే మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు న‌మోదు చేసిన సీఐడీ పోలీసులు.. ఆయ‌న‌ను విచారించారు. అయితే.. ఇటీవ‌ల దీనిపై స్పందించిన హైకోర్టు 41 ఏ కింద నోటీసులు ఇచ్చి.. విచారించాల‌ని అంత‌కుమించి దూకుడుగా ముందుకు వెళ్లొద్ద‌ని కూడా సూచించింది. […]