కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరహార దీక్ష కొనసాగుతుంది. రాజమండ్రి ప్రభుత్వాస్పత్రి వద్ద సోమవారం సాయంత్రం 5గంటలకు డా.రమేష్ కిషోర్, డా.విజయేంద్ర ఆధ్వర్యంలో డాక్టర్ల బృందం ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం పై హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ముద్రగడ దీక్ష 105గంటలకు చేరుకుంది. ఇప్పటి వరకూ ఎలాంటి పరీక్షలకు ముద్రగడ అనుమతించలేదని డాక్టర్ల బృందం స్పష్టం చేసింది ముద్రగడ చూసేందుకు బాగానే వున్నా ఆరోగ్యం బాగా క్షీణించిందని తెలిపారు. ప్రస్తుతం నీళ్లు త్రాగుతున్నారని తెలిపారు. బిపీ […]
Category: Politics
సిద్దప్పా ఏందీ నీ కాకి గోలా??
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న కర్ణాటక సీఎం..మరో అంకానికి తెర తీశారు. కర్ణాటక ముఖ్యమంత్రి వాచీ గొడవ సద్దుమణగ్గానే… ఇప్పుడు కారు వివాదం తెరపైకి వచ్చింది. సీఎం సిద్ధరామయ్యకు మొదట్నుంచి నమ్మకాలెక్కువ. కాగా కొన్ని రోజుల క్రితం ఆయన అధికారికంగా వాడే కారుపైన ఒక కాకి కూర్చుంది. ఎంత తరిమినా పోకుండా కారు బానెట్ పై తచ్చాడింది. ఆ మొత్తాన్ని ఎవరో వీడియో కూడా తీరు. కాకి తన కారునే అంటిపెట్టుకుందని తెలిసిన సిద్దరామయ్య వెంటనే […]
కోదండరాం ని కెలకొద్దు – కెసిఆర్
తెలంగాణ జేఏసీ కన్వీనర్ కోదండరాంను విమర్శించవద్దని మంత్రులు, పార్టీ నేతలకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో విమర్శలు చేస్తే దాన్ని విపక్షాలు అనుకూలంగా మరల్చుకునే అవకాశముందనే ఉద్దేశంతో కేసీఆర్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఇప్పటికే చాలా నష్టం జరిగిందని గ్రహించిన కెసిఆర్ నష్ట నివారణకి పూనుకున్నాడు. రెండేళ్ళ పాలన పూర్తి చేసుకున్న సందర్భంలో టి.సర్కార్ తీరుపై కోదండరాం విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఆపై కోదండరాంను తప్పబడుతూ మొత్తం […]
కాపులంతా ఒక్కటైతే, చంద్రబాబు పరిస్థితేంటి?
కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులంతా సమావేశం కానున్నారట. ఇందులో సినీ, రాజకీయ రంగాలకు చెందినవారున్నారని సమాచారమ్. ప్రముఖ వ్యాపారవేత్తలు కూడా ఈ సమావేశానికి ఆహ్వానిస్తున్నట్లు తెలియవస్తోంది. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన కాపు సామాజిక వర్గ ప్రముఖులు, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న కాపు ఉద్యమం – రాజకీయాలపై ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారట. ముద్రగడ పద్మనాభం దీక్ష విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుని ఖండిస్తోన్న నేతలంతా ఈ కాపు సమావేశానికి హాజరు కానున్నట్లు సమాచారమ్. సినీ రంగం నుంచి […]
పాపం ఈ జంపింగ్ లు అభివృద్ధి కోసమేనట..హవ్వ..
నల్గొండ లోక్సభ సభ్యుడు గుత్తా సుఖేందర్రెడ్డి, మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోద్, ఎమ్మెల్యేలు భాన్కర్ రావు, రవీంద్రనాయక్ తాము అధికార టీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నట్లు ప్రకటించారు. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములం కావాలనే టీఆర్ఎస్లో చేరుతున్నామని సెలవిచ్చారు. తాము ఎల్లుండి సీఎం కేసీఆర్ సమక్షంలో తెరాసలో చేరనున్నట్టు అధికారికంగా ప్రకటించారు.గుత్తా సుఖేందర్ రెడ్డి ఇంకో అడుగు ముందుకేసి మాట్లాడుతూ కాంగ్రెస్ను వీడుతుండడం తమకు బాధ కలిగిస్తోందని అన్నారు. కాంగ్రెస్లోని అంతఃకలహాలతో తాము మనో వేదనకు గురయ్యామని […]
భర్త వేధింపులు తాళలేక..రేప్ స్టోరీ అల్లుకుంది..
ఆమె ఓ నర్సు. ముంబైలోని థానే హాస్పిటల్ లో ఉద్యోగం చేస్తోంది. మంచి జీతమే. కానీ ఇంట్లో పరిస్థితే బాలేదు. భర్త వేధింపులు. కొడుకు తమవాడే కాబట్టి కుటుంబసభ్యులదీ అతని మాటే. నిత్యం గొడవలు. ప్రశాంతత లేదు. మొత్తానికి 26ఏళ్లకే ఆమె జీవితంపై నిరాశ పెంచుకుంది. చనిపోవాలని అనుకోకపోయినా ఈ గొడవలను తప్పించుకోడానికి ఓ ప్లాన్ వేసుకుంది. ఇలా చెప్తే వేధించకుండా వదిలేస్తారనుకుందో ఏమో గానీ తనపై కొందరు అత్యాచారం చేశారని ఇంట్లో చెప్పింది. హాస్పిటల్ నుంచి […]
అపోలో కిడ్నీ దందాలో వాళ్లూ ఉన్నారా?
కొన్ని రోజుల క్రితం దేశ రాజధానిలో కిడ్నీ రాకెట్ గుట్టురట్టు చేశారు పోలీసులు. ఈ గ్యాంగ్ లో ఢిల్లీలో పెద్ద కార్పోరేట్ హాస్పిటల్ అపోలో పేరు బయటకొచ్చింది. ఇక్కడే పలువురికి కిడ్నీ మార్పిడి జరిగినట్లు తేలింది. ఆపరేషన్లు చేసింది సీనియర్ డాక్టర్లే. అయితే వారికి అసలు విషయం చెప్పకుండా వాళ్ల అసిస్టెంట్లు పనికానిచ్చినట్లు పోలీసులు చెప్పారు. కానీ తాజాగా కిడ్నీ విభాగానికి చెందిన ముగ్గురు సీనియర్ వైద్యులను ప్రశ్నించాలని నిర్ణయించారు. ఇంటరాగేషన్ లో రాజ్ కుమార్ రావ్ […]
ముద్రగడ సీబీఐని అందుకే వద్దొంటున్నారా?
కాపు రిజర్వేషన్ల ఉద్యమంలో కీలక మలుపు ఏమిటంటే ఆసుపత్రిలో బలవంతంగా తనను చేర్చినప్పటికీ ముద్రగడ పద్మనాభం దీక్ష విరమించడానికి సిద్ధపడటంలేదు. బలవంతంగా వైద్యులు ఆయనకు ఫ్లూయిడ్స్ ఎక్కించాలని చూస్తుండగా, వారిని ప్రతిఘటిస్తున్నారు ఆయన. ఇంకో వైపున తుని విధ్వంసంపై సిబిఐ విచారణ చేయించడానికి సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు ప్రభుత్వం మేకపోతు గాంభీర్యం ప్రదర్శించింది. సిబిఐకి ఇచ్చేంత చిత్తశుద్ధి చంద్రబాబు ప్రభుత్వానికి లేదు. అందుకనే ముద్రగడ అంగీకరించాలనే అడ్డుపుల్ల వేసింది. ముద్రగడ కూడా సిబిఐ విచారణకు ఒప్పుకోకపోవచ్చు. ఎందుకంటే […]
ఇది ఆంధ్ర కాదు అమిత్ జీ..లెక్క పక్క ఉండాలే!!
తెలంగాణను బీజేపీ ఆదుకోలేదని తెలంగాణ నుంచి పోలవరం ముంపు మండలాల పేరుతో ఖమ్మం జిల్లాలోని కొంత ప్రాంతాన్ని దోచుకుని, తమ మిత్రపక్షం కోరిక మేరకు ఆంధ్రప్రదేశ్కి అప్పగించిందని తెలంగాణ రాష్ట్ర మంత్రి, టిఆర్ఎస్ ముఖ్య నాయకుడు హరీష్రావు విమర్శించారు. నల్లగొండ జిల్లాలో నిన్న బిజెపి భారీ బహిరంగ సభ నిర్వహించగా, ఆ సభకు హాజరైన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, తెలంగాణకు 90 వేల కోట్ల రూపాయల నిధుల్ని కేంద్రం ఇచ్చిందనీ అయినా తెలంగాణ […]