వైసీపీని కుదిపేస్తున్న రెండు హాట్ టాపిక్‌లు.. ఎందుకంటే…!

ఏపీ అధికార పార్టీ వైసీపీలో నేత‌ల‌ను.. రెండు కీల‌క విష‌యాలు కుదిపేస్తున్నాయి. ఈ రెండు అంశాల‌పైనే చ‌ర్చ జ‌రుగుతోంది. ఏ ఇద్ద‌రు నేత‌లు క‌లిసినా.. ఈ రెండు అంశాలే కేంద్రంగా చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఎందుకంటే.. ఇటీవ‌ల కాలంలో ఈ రెండు అంశాల‌ను ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ భారీ ఎత్తున ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లింది. దీంతో ఆయా అంశాలపై ప్ర‌జ‌ల్లో చ‌ర్చ‌కు దారితీయ‌క ముందే.. టీడీపీ నేత‌లు చ‌ర్చిస్తుండడం గ‌మ‌నార్హం. ఇంత‌కీ.. అవేంటంటే.. ఔను! మ‌న‌ల్ని మ‌నం హైలెట్ […]

జ‌గ‌న్ కేబినెట్లో ఈ 4 గురికి మంత్రుల‌కు మ‌ళ్లీ ఛాన్స్‌.. మిగిలినోళ్లు అవుట్ …!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉగాది కానుకగా తన క్యాబినెట్ ను ప్రక్షాళన చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో సైతం జగన్ క్యాబినెట్ ను ఉగాదికి మారుస్తానని మంత్రులతో చెప్పిన సంగతి తెలిసిందే. ఈనెల 15వ తేదీన వైఎస్సార్ సీఎల్పీ మీటింగ్ జర‌గ‌నుంది. ఈ మీటింగ్ లో క్యాబినెట్ లో ఎవరు ఉంటారు ? ఎవరు బయటకు వస్తారు ? ఎవరు కొత్త‌గా వ‌స్తారు ? అన్నదానిపై ఓ క్లారిటీ వచ్చే […]

వైసీపీలో రాజ్య‌స‌భ ప‌ద‌వుల చిచ్చు.. ముస‌లం మొద‌లైందిగా…!

ఏపీలో అధికార వైసీపీలో ఇప్పుడు రాజ్యసభ పదవుల లొల్లి మొదలైంది. ఆంధ్రప్రదేశ్ నుంచి నలుగురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనుంది. దీంతో త్వ‌ర‌లోనే ఈ 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఈ నాలుగు రాజ్యసభ స్థానాలకు త్వరలోనే నోటిఫికేషన్‌ కూడా జారీ చేయనుంది. అధికార వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీనికితోడు టిడిపి – జనసేన నుంచి మరో ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా వైసిపికి సపోర్ట్ చేస్తున్నారు. ఈ లెక్కన […]

విడ‌ద‌ల ర‌జ‌నీకి మంత్రి ప‌ద‌వి ఇస్తే జ‌గ‌న్ రిస్క్‌లో ప‌డ్డ‌ట్టేనా ?

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి త్వ‌ర‌లోనే త‌న కేబినెట్‌ను మారుస్తాన‌ని సంకేతాలు ఇచ్చేశారు. త్వ‌ర‌లోనే మంత్రి వ‌ర్గంలో ఈ మార్పులు జ‌ర‌గ‌బోతున్నాయంటూ ఇటీవ‌ల జ‌రిగిన కేబినెట్ భేటీలో మంత్రుల‌కు జ‌గ‌న్ స్వ‌యంగా చెప్పేశారు. దీంతో ఇప్పుడు మంత్రి వ‌ర్గం నుంచి ఎవ‌రు బ‌య‌ట‌కు వెళ‌తారు ? ఎవ‌రు ఇన్ అవుతారు ? అన్న చ‌ర్చ‌లు ఆస‌క్తిగా న‌డుస్తున్నాయి. మ‌రీ ముఖ్య‌మంగా గుంటూరు జిల్లా చిల‌క‌లూరిపేట ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జ‌నీ కూడా కేబినెట్లో చోటు కోసం విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. […]

వైసీపీ ఎమ్మెల్యేల‌ను ఓడిస్తామంటోన్న సొంత కేడ‌ర్‌…!

ఆయ‌న వైసీపీ ఎమ్మెల్యే.. ఓ రాజ‌కీయ కుటుంబానికి చెందిన నేత‌.. టీడీపీ కీల‌క నేత‌పై వ‌రుస‌గా రెండుసార్లు ఓటీ చేశారు. జ‌గ‌న్ వేవ్‌లో ఎట్ట‌కేల‌కు 2019లో ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఇప్పుడు ఆయ‌న సొంత పార్టీ కేడ‌ర్ నుంచే తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త ఎదుర్కొంటున్నారు. సొంత పార్టీ కేడ‌రే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు టిక్కెట్ ఇస్తే ఓడిస్తామ‌ని శ‌ప‌థాలు చేస్తున్నారు. ఆయ‌న ఎవ‌రో కాదు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిర‌ణ్‌కుమార్. కిర‌ణ్‌కుమార్ తండ్రి గొర్లె హ‌రిబాబు […]

ఏపీ పాలిటిక్స్‌పై ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఎఫెక్ట్..!

దేశ‌వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి ఎన్నిక‌ల రిజ‌ల్ట్ వ‌చ్చేందుకు మ‌రో రెండు రోజుల స‌మ‌యం ఉంది. అయితే.. ఇప్ప‌టికే ఎగ్జిట్ పోల్ ఫ‌లితం వ‌చ్చేసింది. దీనిలో యూపీ లో బీజేపీనే మ‌ళ్లీ అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. అంతేకాదు.. ఇత‌ర రాష్ట్రాల్లోనూ బీజేపీ బ‌లోపేతం కానుండ‌డం మంచి సంకేతాలుఇస్తోంద‌ని.. బీజేపీ నాయ‌కులు అంటున్నారు. అయితే.. ఈ ఎగ్జిట్ పోల్ ఫ‌లితం.. ఏపీకి అనుకూలంగా ఉండ‌డంపైనే చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఎందుకంటే.. కేంద్రంలో బీజేపీ […]

ఇలా చేసి జగన్ పగ తీర్చుకుంటున్నాడా..పెంచుకుంటున్నాడా..?

యస్..ఇప్పుడు అందరూ ఇదే అనుకుంటున్నారు. జగన్ ఏం చేసినా ఓ పక్క ప్లానింగ్ తోనే చేస్తారు అంటుంటారు వైసీపీ నాయకులు. బహుశా ఏపీలో టికెట్ల ఇష్యూ పై జగన్ తీసుకున్న నిర్ణయాని చూసాకా అదే నిజం అనిపిస్తుంది. ఇక్కడ ధర్డ్ ఎంపైర్ అవసరమే లేదు..చూసేవాళ్లకి క్లీయర్ గా అర్ధమైపోతుంది…ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి..సినీ నటుడు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తున్నాడు అని. నిన్న మొన్నటి వరకు ఏపిలో టికెట్ల రేటు పెంచండి మహా ప్రభో […]

ఆ 49 మంది ఎవ‌రు.. వైసీపీలో ఒక్క‌టే హాట్ టాపిక్ ?

అధికార పార్టీ వైసీపీ నుంచి 49 మంది ఎమ్మెల్యేలు.. ఒక పార్టీతో ట‌చ్‌లో ఉన్నారంటూ.. నటుడు శివాజీ చేసిన ప్ర‌క‌ట‌న.. రాజ‌కీ యంగా సంచ‌ల‌నం సృష్టించిందో లేదో తెలియ‌దు కానీ.. వైసీపీలో మాత్రం సంచ‌ల‌నంగానే మారుతోంది. నేత‌ల మ‌ధ్య తీవ్ర చ‌ర్చ‌కు కూడాదారితీసింది. అంతేకాదు.. కొంద‌రు నేత‌ల‌ను అనుమానపు చూపులు కూడా వెంటాడుతున్నాయి. “అన్నా ఏంటిది.. ఎవ‌రుంటారు? ఎవ‌రు పోతారు?“ అనే చ‌ర్చ నేత‌ల మ‌ధ్య జోరుగా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఏ ఇద్ద‌రు నాయ‌కులు క‌లుసుకున్నా.. ఇప్పుడు […]

రాజ‌కీయాల్లోకి జ‌గ‌న్ బామ్మ‌ర్ది.. ఆ ఎమ్మెల్యే సీటు ఖ‌రారైందా…?

ముఖ్యమంత్రి జగన్ ఫ్యామిలీ నుంచి ఇప్పటికే రాజకీయాల్లో చాలా మంది ఉన్నారు. జగన్ పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో ఆయన కడప నుంచి ఎంపీగా కూడా గెలిచారు. ఇక జగన్ సోదరుడు అవినాష్ రెడ్డి కడప ఎంపీగా కొనసాగుతున్నారు. జగన్ తల్లి విజయమ్మ సైతం 2014 ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక జగన్ సోదరి షర్మిల తెలంగాణలో సొంతంగా పార్టీ పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్నారు. ఇక జగన్ […]