వరుణ్ తేజ్ – శేఖర్ కమ్ముల – దిల్ రాజు చిత్రంలో సాయి పల్లవి

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తక్కువ కాలం లో, విన్నూత్నమైన సబ్జక్ట్స్ ఎంచుకుంటూ తనదైన ఐడెంటిటీ సంపాదించుకున్నారు. అటు యువతను ఇటు ఫామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే చక్కటి కథా బలం ఉన్న చిత్రాలను తీసే దర్శకుడు శేఖర్ కమ్ముల. ఇప్పుడు వీరిద్దరి తో, ఉత్తమ కథా చిత్రాల నిర్మాత గా పేరు ఉన్న దిల్ రాజు త్వరలో ఒక చిత్రాన్ని ప్రారంభించబోతున్నారు. మాలర్ పాత్రలో ప్రేమం చిత్రం ద్వారా యువత ను బాగా ఆకట్టుకున్న సాయి […]

జాక్ పాట్ కొట్టనున్న వివేక్..

రాజు తలచు కుంటే దెబ్బలకి కరువా అన్నట్టుంది తెలంగాణా రాజకీయ సిత్రం.కెసిఆర్ కరుణ వుంటే చాలు రాత్రికి రాత్రి ఏ జాక్ పాట్ అయినా తగలోచ్చు.ఒకసారి తెలంగాణ రాష్ట్ర సమితిలోకి వచ్చి చేరి.. తిరిగి కాంగ్రెస్ పార్టీ లోకి వెళ్లిపోయి.. ఎన్నికలను ఆ పార్టీ నుంచే ఎదుర్కొని తిరిగి ఇప్పుడు టీఆర్ ఎస్ లోకి వచ్చి చేరిన కాకా తనయుడు వివేక్ కు ఇప్పుడు జాక్ పాట్ తగలనుందని టిఆర్ ఎస్ లో టాక్. ప్రస్తుతానికి మాజీ […]

జానారెడ్డి దిమ్మతిరిగే స్కెచ్!!

జానారెడ్డి ఉన్నట్టుండి… పెద్ద ప్రెస్ మీట్ పెట్టి మరీ… సీఎల్పీ కి రిజైన్ చేస్తానడడం వెనుక పెద్ద స్టోరీయే ఉందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే టి ఆర్ ఎస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ పేరుతొ టిడిపి, కాంగ్రెస్ నాయకులను తనలో కలిపేసుకుంది. ఇక ఇప్పుడు గులాబీ గురి జానారెడ్డి పై నే అని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులలో రాలేనని చెప్పిన జానా… తన కొడుకు విషయంలో ఒక క్లారిటీకి వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఈమేరకు గులాబీ […]

టిడిపి ఇలాఖాలో అగ్గి రాజేస్తున్న బిజెపి!!

పశ్చిమగోదావరి జిల్లాలో టిడిపి, బిజెపి కూటమి అగ్గి రగులుతోంది. ఈ కూటమి జిల్లా మొత్తాన్ని కైవశం చేసుకున్నా మిత్రుల మధ్యే బేధాభిప్రాయాలు పెరిగి మంత్రి మాణిక్యాలరావు రాజీనామాకు సిద్ధపడే పరిస్థితులకు దారి తీస్తోంది. తాడేపల్లిగూడెం కేంద్రంగా ఈ పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం. దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తాజాగా మరోసారి జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు తీరుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. తాను రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమంటూ తీవ్రస్థాయి నిర్ణయాలకు రెడీ అవుతున్నారు. ఈ […]

చంద్రబాబు కి మెట్రో చీఫ్‌ శ్రీధరన్ షాక్!!

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రో రైలు ప్రాజెక్టుకు గట్టి ఎదురుదెబ్బతాకింది. ఈ ప్రాజెక్టు నుండి తప్పుకుంటానని ఢిల్లీ మెట్రో చీఫ్‌ శ్రీధరన్‌ ముఖ్యమంత్రికి స్పష్టం చేశారు. అమరావతి మెట్రో రైలు ప్రాజెక్టుపై సీఎంతో చర్చ సాగింది. ఈ ప్రాజెక్టుకు నిధుల కేటాయింపుపై శ్రీధరన్‌ తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. నిధులు కేటాయించకుండా 2019 నాటికి ప్రాజెక్టును ఎలా పూర్తిచేస్తామని ఆయన ప్రశ్నించారు. ‘ఇప్పటి వరకు సరిగా నిధులు, వసతులు కల్పించలేదు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉన్నట్లు […]

తంతే మెగా కాంపౌండ్ లో పడ్డ హరీష్ శంకర్

మెగా కాంపౌండ్‌లో డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ ఫుల్‌ బిజీ కానున్నాడట. సాయి ధరమ్‌ తేజ్‌తో ‘సుబ్రహ్మణ్యం పర్‌ సేల్‌’ సినిమా తర్వాత చాలా గ్యాప్‌ తీసుకున్నాడు హరీష్‌ శంకర్‌. చిరంజీవి 150వ సినిమాకు డైరెక్టర్‌ కావాల్సిన వారిలో హరీష్‌ పేరు కూడా బాగా వినిపించింది. ఇప్పటికి అవకాశం అయితే దక్కలేదు. కానీ చేజారిపోలేదు. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్‌తో సినిమా ఓకే చేసుకున్నాడు హరీష్‌. ఇదివరకే అల్లు అర్జున్‌తో హరీష్‌ సినిమా చేయాలనుకున్నాడు కానీ కొన్ని కారణాలతో […]

అగ్రిగోల్ద్ ఆర్తనాదాలు ప్రభుత్వానికి వినిపించేనా?

పోరుదీక్ష పేరుతో గుంటూరు జిల్లాలో అగ్రిగోల్డ్‌ బాధితులు భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న బైబిల్‌ మిషన్‌ గ్రౌండ్‌లో ఈ సభ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్‌ చేశారు. అగ్రిగోల్డ్ బాధితుల ధర్నాతో హైవేపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించింది. వెయ్యి కోట్లు ఆర్థిక సహాయం అందించాలని … సీఐడీ దగ్గర బాధితుల లిస్టును ఆన్‌లైన్‌లో పెట్టాలని డిమాండ్‌ చేశారు. కాగా అగ్రిగోల్డ్ బాధితులు […]

రజినీ రోబో 2.0 సెంచరీ కొట్టాడు..

స్టార్ డైరెక్టర్ శంకర్, సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబినేషన్‌లో ఓ మూవీ పట్టాలెక్కనుంది అంటే.. ఆ మూవీపై ఏ రేంజ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం రోబో చిత్రానికి సీక్వెల్‌గా 2.0 అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో హాలీవుడ్ రేంజ్‌లో ఈ మూవీని శంకర్ తెరకెక్కిస్తున్నాడు. గత ఏడాది డిసెంబర్ 16న మెదలైన ఈ చిత్ర షూటింగ్ నేటితో వంద రోజులు పూర్తి చేసుకున్నట్టు శంకర్ తెలిపాడు. రెండు భారీ యాక్షన్ […]

ఉద్యోగుల తరలింపు పై చంద్రబాబు వెనకడుగు.

అనుభవం అయితే గానీ తత్వం బోధపడదన్న విషయా న్ని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిదానంగా గ్రహిస్తున్నారు. జూన్ 27 కల్లా హైదరాబాద్ సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులంతా, వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయానికి తరలి రావలసిందేనని సీఎం హుకుం జారీ చేశారు. అయితే, వాస్తవ పరిస్థితులు, భవన నిర్మాణ స్థితిగతులపై వస్తున్న నివేదికలను పరిశీలిస్తున్న సీఎం, ఇప్పుడు పట్టువిడుపుల ధోరణితో వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయం, ఇంటీరియర్ డెకరేషన్ సహా పూర్తి కావాలంటే […]