నంద్యాల‌లో కాంగ్రెస్ టార్గెట్ ఎవ‌రు?

విభ‌జ‌న త‌ర్వాత‌ ఏపీలో కాంగ్రెస్ అస్తిత్వం కోసం పోరాడుతోంది. సరైన స‌మ‌యంలో ఉనికి చాటాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది. వీలైనంత వ‌రకూ పోటీలో నిలిచి అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల‌ను దెబ్బ‌తీయాల‌ని చూస్తోంది! ఇప్పుడు ఆ స‌మయం వ‌చ్చింద‌ని భావిస్తోంది. నంద్యాల ఎన్నిక‌ల‌ను స‌రైన వేదిక‌గా చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకుంది. ప్ర‌స్తుతం నంద్యాల‌లో అధికార టీడీపీ, ప్ర‌తిప‌క్ష వైసీపీ బ‌రిలోనే నిలుస్తుండ‌గా.. ఇప్పుడు పోటీలో మేము కూడా ఉన్నామ‌ని ప్ర‌క‌టించింది. ఇదే ఇప్పుడు వైసీపీ, టీడీపీ నేత‌ల్లో గుబులు పుట్టిస్తోంది. కాంగ్రెస్ గెల‌వ‌క‌పోయినా.. […]

దిక్కుతోచని పరిస్థిలో టీఆరెస్ ఎమ్మెల్యే

తెలంగాణ సీఎం కేసీఆర్ దెబ్బ‌తో అధికార టీఆర్ఎస్‌కు చెందిన ఓ ఎమ్మెల్యేకు జ్వ‌రం ప‌ట్టుకుంద‌ట‌. వచ్చే ఎన్నిక‌ల్లో కేసీఆర్ త‌న‌కు టిక్కెట్ ఇవ్వన‌న్న ఫ్రీల‌ర్లు వ‌ద‌ల‌డంతో ఇప్పుడు స‌ద‌రు ఎమ్మెల్యే త‌న బాధ ఎవ‌రికి చెప్పుకోవాలో అర్థంకాక మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నార‌ట‌. ఇక తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్‌కు చెందిన చాలా మంది ఎంపీలు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేయాల‌ని అనుకుంటున్నారు. ఈ జాబితా చాలానే ఉంది. ఈ జాబితాలోకి కొత్త‌గా వ‌చ్చి చేరారు మెద‌క్ ఎంపీ కొత్త […]

పాల‌కొల్లు మ‌రో గ‌ర‌గ‌ప‌ర్రు అవుతోందా..!

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోని గ‌ర‌గ‌పర్రు ప్ర‌స్తుతం అట్టుడుకుతోంది. అక్క‌డ ద‌ళిత‌వ‌ర్గాల‌కు చెందిన వారిని వెలివేశార‌న్న వార్త‌ల‌తో ఆ గ్రామం పేరు ఇప్పుడు మీడియాలో మార్మోగుతోంది. గ‌ర‌గ‌ప‌ర్రులో ద‌ళితులంతా ఉద్య‌మిస్తుంటే ఇప్పుడు అదే జిల్లాలోని పాల‌కొల్లు కేంద్రంగా బీసీలంతా స్థానిక టీడీపీ ఎమ్మెల్యే నిమ్మ‌ల రామానాయుడుకు యాంటీగా ఒక్క‌ట‌వుతున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో కొద్ది రోజులుగా జ‌రుగుతోన్న ప‌రిణామాల నేప‌థ్యంలో జిల్లాలోని బీసీల‌తో పాటు కోన‌సీమ‌లో బ‌ల‌హీన‌వ‌ర్గాల్లో బ‌ల‌మైన ఓ ప్ర‌ధాన సామాజిక‌వ‌ర్గం మొత్తం నిమ్మ‌ల‌కు వ్య‌తిరేకంగా గ‌ళ‌మెత్తుతోంది. నిమ్మ‌ల పాల‌కొల్లు నియోజ‌క‌వ‌ర్గంలో […]

టీడీపీలో సస్పెన్షన్ల పరంపర..మరి ఆ ఇద్దరి ఎంపీల సంగతేంటో..?

ఆంధ్రప్రదేశ్‌లో అధికార టీడీపీలో సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. ఈ స‌స్పెన్ష‌న్ల ప‌ర్వానికి బ్రేక్ ఎప్పుడు ప‌డుతుందో కూడా తెలియ‌ని ప‌రిస్థితి. ఈ జాబితాలో చ‌ట్ట‌స‌భ‌ల్లో ఉన్న ఎమ్మెల్యేల నుంచి కౌన్సెల‌ర్ల వ‌ర‌కు ఉంటున్నారు. వీరికి తోడు ఇప్పుడు ఏకంగా ఒక‌రిద్ద‌రు ఎంపీలు సైతం పార్టీనే ధిక్క‌రిస్తున్నారు. వారి పేర్లు సైతం స‌స్పెన్ష‌న్ జాబితాలో ఉన్నా వారిపై పార్టీ అధిష్టానం చ‌ర్య‌లు తీసుకునేందుకు సాహ‌సించ‌లేని ప‌రిస్థితి. టీడీపీ స‌స్పెన్ష‌న్ల ప‌రంప‌ర‌లో మరో నాయకుడు ఆ పార్టీ నుంచి సస్పెన్షన్‌ […]

టీఆర్ఎస్ కీల‌క నేత‌ల మౌనం.. అస‌లేం ఏం జ‌రిగింది? 

తెల్లారింది మొద‌లు పొద్దు గూకే వ‌ర‌కు మీడియా మైకుల ముందు మాట‌ల ప్ర‌వాహంతో విప‌క్షాల‌ను దంచికొట్టే.. టీఆర్ ఎస్ నేత‌లు ఇప్పుడు ఒక్క‌సారిగా మౌనం పాటించేస్తున్నారు! ముఖ్యంగా నిజామాబాద్ ఎంపీ క‌విత‌, మంత్రి హ‌రీష్‌రావు, నాయిని త‌దిత‌ర ప్ర‌ధాన పోస్టుల్లో ఉన్న నేత‌లు సైతం ఇప్పుడు మీడియాకు ముఖం చాటేస్తున్నారు. మ‌రో రెండేళ్ల‌లో కీల‌క‌మైన ఎన్నిక‌లు రాబోతున్న త‌రుణంలో నేత‌లు ఇలా గ‌ప్‌చుప్ అయిపోవ‌డం.. ఇప్పుడు రాష్ట్రంలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. విష‌యంలోకి వెళ్తే.. ఇటీవ‌ల కాలంలో విప‌క్షాల […]

ఇద్ద‌రు చంద్రుల షేక్ హ్యాండ్ అందుకేనా?

ఏపీ, తెలంగాణ సీఎంలు కేసీఆర్‌, చంద్ర‌బాబుల వైఖ‌రే డిఫ‌రెంటు. ఈ ఇద్ద‌రూ అవ‌స‌రాన్ని బ‌ట్టి తిట్టుకోవ‌డం, అవ‌స‌రాన్ని బ‌ట్టి పొగుడుకోవ‌డం ప‌రిపాటైంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు కృష్ణా వాట‌ర్ విష‌యంలో ఎవ‌రికి వారే అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించిన ఈ ఇద్ద‌రు ఇప్పుడు ఢిల్లీలో జ‌రిగిన రాష్ట్ర‌ప‌తి నామినేష్ ఘ‌ట్టానికి వెళ్లిన సంద‌ర్భంలో మాత్రం చిరున‌వ్వులు చిందుకుని, షేక్ హ్యాండులు ఇచ్చేసుకుని మీడియాకు ఫోజులిచ్చారు. దీంతో ఇప్పుడు వీరిద్ద‌రి చుట్టూతానే పాలిటిక్స్ రింగులు కొడుతున్నాయి. ఎవ‌రికివారే సొంత లాభం లేకుండా […]

అమ‌రావ‌తి పూలింగ్‌పై ప్ర‌పంచ బ్యాంకు త‌నిఖీలు!

సీఎం చంద్ర‌బాబు అమ‌రావ‌తి క‌ల‌లు ఇప్ప‌ట్లో నెర‌వేరేలా లేవు. ఏ ముహూర్తాన ఆయ‌న అమ‌రావ‌తికి ప్లేస్ డిసైడ్ చేసుకున్నాడో.. అప్ప‌టి నుంచి క‌ష్టాలు ప‌డుతూనే ఉన్నాడు. తాజాగా ఆయ‌న అమ‌రావ‌తి కోసం చేసిన ల్యాండ్ పూలింగ్‌పై ప్ర‌పంచ బ్యాంకు త‌నిఖీ కొర‌డా ఝ‌ళిపిస్తోంది. బాబు చేసిన ల్యాండ్ పూలింగ్‌తో తాము న‌ష్ట‌పోయామ‌ని పేర్కొంటూ రాజ‌ధాని ప్రాంత రైతులు ఇప్ప‌టికే ప్ర‌పంచ బ్యాంకుకు లేఖ రాశారు. మొద‌ట్లో బ్యాంకు అధికారులు ఇది మామూలే క‌దా అనుకున్నా.. లేఖ‌ల ప‌రంప‌ర […]

నంద్యాల ఓట‌ర్ల‌కు టీడీపీ బంప‌ర్ ఆఫ‌ర్‌

నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో గెలుపు కోసం అటు టీడీపీ, ఇటు వైసీపీ.. ఇప్ప‌టినుంచే ప్ర‌య‌త్నాలు మొదలుపెట్టేశాయి. ముఖ్యంగా ఓట‌ర్ల‌ను త‌మ వైపు తిప్పుకునేందుకు నేత‌లు ప్రచారం ప్రారంభించేశారు. ఇంకా ఎన్నిక‌ల ప్ర‌చారం కూడా ప్రారంభం కాక‌ముందే.. వాగ్థానాలు జోరందుకున్నాయి. పట్ట‌ణ‌ ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకు టీడీపీ కేబుల్ కనెక్ష‌న్ ఫ్రీ అంటూ ప్ర‌క‌టించ‌డం.. దీనికి కౌంట‌ర్‌గా వైసీపీ కూడా బ‌దులివ్వ‌డం ఇప్పుడు అంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తోంది. ఇంకా ఎన్నిక‌ల ప్ర‌చారానికి ఈసీ నోటిఫికేష‌న్ ఇవ్వ‌క‌ముందే.. ఇలా హామీలు గుప్పిస్తుంటే.. […]

రామోజీ – రాధాకృష్ణ చంద్ర‌బాబుకు ఎవ‌రు ఎక్కువ‌..!

మీడియా మేనేజ్‌మెంట్‌లో సీఎం చంద్ర‌బాబును మించిన వారు లేర‌నే చెప్పుకోవాలి! ముఖ్యంగా అల‌నాడు ఎన్టీఆర్ అధికారంలోకి రావడానికి ప్ర‌ధాన కార‌ణ‌మైన ఈనాడుతోనే.. ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా వార్త‌లు రాయించి.. ప‌ద‌వి నుంచి దింపించేశారు. ఆ త‌ర్వాత అదే ప‌త్రిక ఆయ‌న‌కు అండ‌గా నిలబడుతూ వ‌స్తున్న విషయం ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అయితే ఇప్పుడు ఈనాడు ప‌త్రికను ప‌క్క‌న పెట్టేయాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని తెలుస్తోంది. దాని కంటే మిన్న‌గా, ప్ర‌భుత్వాన్ని భుజాల‌పై మోస్తున్న ఆంధ్ర‌జ్యోతిని అంద‌లం ఎక్కించాల‌ని భావిస్తున్నార‌ట‌. దీనికి […]