లోకేశ్ మాట‌లు బెదిరింపులా..?  బ్లాక్ మెయిలా..?

స‌దావ‌ర్తి భూముల అంశంపై మంత్రి లోకేశ్ చేస్తున్న వ్యాఖ్య‌లు ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. బెదిరిస్తున్నారా? లేక బ్లాక్‌మెయిల్ చేస్తున్నారా? అనిపించేలా ఆయ‌న మాట్లాడుతున్న తీరు అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. స‌దావ‌ర్తి భూముల వ్య‌వ‌హారంలో స‌ర్కారు ఇరుకున ప‌డింది. దాదాపు వెయ్యి కోట్ల విలువైన భూముల‌ను నామ‌మాత్ర‌పు వేలంపాట‌తో కేవ‌లం రూ.22 కోట్ల‌కు కొట్టేసేందుకు ప్ర‌యత్నించింద‌ని వైసీపీ ఎమ్మెల్యే హైకోర్టులో పిల్ దాఖ‌లు చేయ‌డం.. అందుకు ప్ర‌తిగా రూ.5కోట్లు చెల్లిస్తే భూములు వారికే ఇస్తామ‌ని స‌ర్కార్ స‌వాలు విస‌ర‌డం తెలిసిందే! […]

గ‌జ్వేల్‌కు కేసీఆర్ బైబై…. ఆ నియోజ‌క‌వ‌ర్గంపై  క‌న్ను..!

తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పుడు ఎమ్మెల్యేగా ప్రాథినిత్యం వ‌హిస్తోన్న గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గానికి గుడ్ బై చెప్ప‌నున్నారా ? వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న మ‌రో కొత్త నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారా ? అంటే తెలంగాణ రాజ‌కీయ‌వ‌ర్గాల్లో వినిపిస్తోన్న ఇన్న‌ర్ టాక్ ప్ర‌కారం అవున‌నే ఆన్స‌రే వినిపిస్తోంది. రాష్ట్ర పున‌ర్విభ‌జ‌న‌చ‌ట్టంలో పేర్కొన్న నియోజ‌క‌ర్గాల పున‌ర్విభ‌జ‌న అంశం మ‌రోసారి తెర‌మీద‌కు వ‌చ్చింది. ఎన్డీయే రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థికి ఏపీలో మిత్ర‌ప‌క్షంగా ఉన్న టీడీపీతో పాటు తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ సైతం […]

వైసీపీలోకి నాగార్జున‌…. జ‌గ‌న్‌తో కింగ్ డీల్ ఏంటి

దివంగ‌త లెజెండ్రీ హీరో అక్కినేని నాగేశ్వ‌ర‌రావు వార‌సుడిగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన నాగార్జున మ‌న్మ‌థుడిగా, కింగ్‌గా టాలీవుడ్ అభిమానుల మ‌న‌స్సు దోచుకున్నాడు. సినిమాల్లోను, బ‌య‌టా నాగార్జున వ్య‌క్తిత్వం కాస్త భిన్నం. వివాదాల‌కు దూరంగా అంద‌రితోను స‌మ‌న్వ‌యంతో ముందుకు వెళ్లే నాగ్‌ది ప‌క్కా బిజినెస్ మైండ్ అన్న టాక్ ఉంది. వ్యాపారంలో పెట్టిన పెట్టుబ‌డికి చాలా రెట్లు ఎలా రాబ‌ట్టుకోవాలో నాగ్‌కు బాగా తెలుసు. ఇక తెలంగాణ‌లో కేసీఆర్ ఎన్నిక‌ల ప్ర‌చారంలోనే నాగ్ అక్ర‌మ ఆస్తులు, క‌ట్ట‌డాల‌ను టార్గెట్ […]

పీకే జ‌వాబుతో అంద‌రూ ఫూల్స్

`వైసీపీ అధినేత జ‌గ‌న్ ఏరికోరి తెచ్చుకున్న ఎన్నిక‌ల ప‌రిశీల‌కుడు ప్ర‌శాంత్ కిషోర్ స‌ర్వే వైసీపీ నేతల్లో గుబులు పుట్టిస్తోంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు ప్రతికూల పరిస్థితులున్నట్లు ఇందులో తేలింది. టీడీపీకి మ‌రోసారి విజ‌యం గ్యారెంటీ` అని టీడీపీ అనుకూల మీడియాలోనూ, సామాజిక మాధ్యమాల్లో కొంత‌మంది అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించేశారు. ప్ర‌స్తుతం వీరి అత్యుత్సాహం నీరుగారిపోయింది. ఇప్పుడు వీళ్లంతా ఫూల్స్ అయిపోయారు. వైఎస్ఆర్ సీపీని, నేత‌ల‌ను ఇరుకున పెట్టి సోష‌ల్ మీడియాలో వీలైనంత వ‌ర‌కూ ల‌బ్ధి పొందాల‌ని చూసిన వీరంతా.. `ఇదంతా […]

నంద్యాల టీడీపీలో `ఎవ‌రికి వారే య‌మునా తీరే’

నంద్యాల ఉప ఎన్నిక‌ల అధికార పార్టీ నేత‌ల్లో విభేదాలు సృష్టిస్తోంది. ఉప ఎన్నిక ప్ర‌క‌ట‌న నాటి నుంచి వ‌రుస విభేదాలు ర‌గులుతున్న వేళ‌.. అంత‌ర్గ‌త క‌ల‌హాలు ముదిరి పాకాన ప‌డ్డాయ‌నే ప్ర‌చారం జోరుగా వినిపిస్తోంది. గెలుపు కోసం ప్ర‌య‌త్నించాల్సిన చోట `ఎవ‌రికి వారే య‌మునా తీరే` అన్న చందంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ముఖ్యంగా త‌మ‌కు ప‌ట్టున్న నియోజక‌వ‌ర్గంలో వేరే వారికి గెలుపు బాధ్య‌తలు అప్ప‌జెప్ప‌డాన్ని మంత్రి అఖిల‌ప్రియ జీర్ణించుకోలే క‌పోతున్నారు. తన తండ్రి నియోజక‌వ‌ర్గంలో.. ఇత‌రుల ప్ర‌మేయంపై తీవ్ర […]

జ‌గ‌న్‌లో మార్పు వెనుక కార‌ణాలివేనా.. 

సీఎం చంద్ర‌బాబు 2014లో అధికారంలోకి రావ‌డానికి ఆయ‌న సీనియ‌రిటీనేగాక‌, ఉద్యోగులు కూడా కొంత కార‌ణం! 2004 ఎన్నిక‌ల్లో ఆయ‌న ఓడిపోవ‌డానికి కార‌ణం కూడా ఉద్యోగులే! `నేను మారాను. గ‌తంలోలా ఉద్యోగుల‌తో క‌ఠినంగా వ్య‌వహ‌రించ‌ను` అని చంద్ర‌బాబు పదేప‌దే చెబుతూ వారిలో న‌మ్మ‌కం క‌లిగేలా చేశారు. ఇక 2019 ఎన్నిక‌ల్లో అధికారం చేజిక్కించుకోవ‌డానికి ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్.. ఇప్ప‌టినుంచే `నేను మారాను` అనే సంకేతాలు ఇస్తున్నారు. ఆయ‌న వ్య‌వ‌హార‌శైలిపై తీవ్ర విమ‌ర్శ‌లు చేసిన నేత‌లే ఇప్పుడు ముక్కున వేలేసుకుంటున్నారు. […]

ఆ మంత్రుల‌కు చంద్ర‌బాబు వార్నింగ్ వెన‌క‌..!

టీడీపీ అంటే ఒక‌ప్పుడు క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మారు పేరు. టీడీపీ వాళ్లంతా ఒకే కుటుంబంలోని అన్న‌ద‌మ్ముళ్లా క‌లిసి మెలిసి ఉండేవారు. అయితే అదంతా గ‌తం ఇప్పుడు సీన్ మారిపోయింది. 2014 ఎన్నిక‌ల్లో గెలిచి టీడీపీ అధికారంలోకి వ‌చ్చాక పార్టీలో ఎవ‌రికి వారే ఇష్ట‌మొచ్చిన‌ట్టు స్వ‌రం పెంచేస్తున్నారు. ఈ విష‌యంలో చంద్ర‌బాబు వార్నింగ్‌లు కూడా ప‌ని చేయ‌డం లేదు. చాలా మంది అయితే చంద్ర‌బాబునే లైట్ తీస్కొంటున్న‌ట్టు క‌న‌ప‌డుతోంది. ఎవ‌రో ఒక నాయ‌కుడు నోరు జార‌డం, అది మీడియాలో హైలెట్ […]

టీఆర్ఎస్‌లో బాబూ మోహ‌న్ పనైపోయిందా..!

తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్‌లో బాబూ మోహ‌న్ ప‌నైపోయిందా ? సీఎం కేసీఆర్‌ను ముద్దుగా బావా..బావా అని ఆప్యాయంగా పిలుచుకునే బాబూ మోహ‌న్‌కు ఆ బావే షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారా ? అంటే ప్ర‌స్తుతం మెద‌క్ జిల్లాలో జ‌రుగుతోన్న ప‌రిణామాలు అవున‌నే అంటున్నాయి. టీడీపీతో రాజ‌కీయ ప్ర‌స్థానం ప్రారంభించిన బాబూ మోహ‌న్ మెద‌క్ జిల్లాలోని ఆందోల్ ఎస్సీ స్థానం నుంచి 1998 ఉప ఎన్నిక‌తో పాటు, 1999 ఎన్నికల్లోను బాబూ మోహ‌న్ రెండుసార్లు దామోద‌ర రాజ‌న‌ర్సింహ‌ను ఓడించాడు. […]

2019 వార్‌: ఏపీ, తెలంగాణ‌లో ఎవ‌రు ఎవ‌రికి ఫ్రెండో..!

2019 సాధార‌ణ ఎన్నిక‌ల‌కు మ‌రో రెండేళ్ల టైం ఉంది. ఎన్నిక‌ల‌కు ఆరు నెల‌ల టైం ప‌క్కన పెట్టేస్తే 15 నెల‌లు మాత్ర‌మే ఉంది. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోను వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రు ఎవ‌రితో జ‌ట్టు క‌డ‌తారు ? అధికార పార్టీల‌ను ఢీకొట్టేందుకు కొత్త పొత్తుల లెక్క ఏంట‌న్న‌దానిపై ఊహాగానాలు, చ‌ర్చ‌లు అప్పుడే స్టార్ట్ అయ్యాయి. రెండు చోట్లా కామ‌న్ పాయింట్ ఏంటంటే అధికార పార్టీల‌ను ఓడించేందుకు విప‌క్షాల‌న్ని ఒకే కూట‌మిగా ఏర్ప‌డేందుకు స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతున్నాయి. అయితే […]