టీఆర్ఎస్‌లో బాబూ మోహ‌న్ పనైపోయిందా..!

తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్‌లో బాబూ మోహ‌న్ ప‌నైపోయిందా ? సీఎం కేసీఆర్‌ను ముద్దుగా బావా..బావా అని ఆప్యాయంగా పిలుచుకునే బాబూ మోహ‌న్‌కు ఆ బావే షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారా ? అంటే ప్ర‌స్తుతం మెద‌క్ జిల్లాలో జ‌రుగుతోన్న ప‌రిణామాలు అవున‌నే అంటున్నాయి. టీడీపీతో రాజ‌కీయ ప్ర‌స్థానం ప్రారంభించిన బాబూ మోహ‌న్ మెద‌క్ జిల్లాలోని ఆందోల్ ఎస్సీ స్థానం నుంచి 1998 ఉప ఎన్నిక‌తో పాటు, 1999 ఎన్నికల్లోను బాబూ మోహ‌న్ రెండుసార్లు దామోద‌ర రాజ‌న‌ర్సింహ‌ను ఓడించాడు. […]

2019 వార్‌: ఏపీ, తెలంగాణ‌లో ఎవ‌రు ఎవ‌రికి ఫ్రెండో..!

2019 సాధార‌ణ ఎన్నిక‌ల‌కు మ‌రో రెండేళ్ల టైం ఉంది. ఎన్నిక‌ల‌కు ఆరు నెల‌ల టైం ప‌క్కన పెట్టేస్తే 15 నెల‌లు మాత్ర‌మే ఉంది. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోను వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రు ఎవ‌రితో జ‌ట్టు క‌డ‌తారు ? అధికార పార్టీల‌ను ఢీకొట్టేందుకు కొత్త పొత్తుల లెక్క ఏంట‌న్న‌దానిపై ఊహాగానాలు, చ‌ర్చ‌లు అప్పుడే స్టార్ట్ అయ్యాయి. రెండు చోట్లా కామ‌న్ పాయింట్ ఏంటంటే అధికార పార్టీల‌ను ఓడించేందుకు విప‌క్షాల‌న్ని ఒకే కూట‌మిగా ఏర్ప‌డేందుకు స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతున్నాయి. అయితే […]

క‌విత ఎంపీ సీటుపై ట్రావెల్స్ అధినేత కన్ను

తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె ప్ర‌స్తుతం నిజామాబాద్ ఎంపీగా కొన‌సాగుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆమె మ‌రోసారి ఎంపీగా పోటీ చేసేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేద‌ని కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. వ‌చ్చే ఎన్నిక‌ల త‌ర్వాత ఆమె ఎంపీగా కంటే ఎమ్మెల్యేగా గెలిచిన తెలంగాణ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని భావిస్తున్నారు. మంత్రి అవ్వాల‌న్న కోరిక క‌విత‌కు బ‌లంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇక టీఆర్ఎస్ ఎన్డీయేలో చేరితే వ‌చ్చే ఎన్నిక‌ల త‌ర్వాత ఆమెకు కేంద్ర మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌న్న […]

న‌ల్గొండ జిల్లాలో ఆ రెండు సీట్లలో టీఆర్ఎస్‌కు ఓట‌మేనా..!

తెలంగాణ‌లోని పాత న‌ల్గొండ జిల్లా పేరు చెపితే కాంగ్రెస్‌కు కంచుకోట‌. చంద్ర‌బాబు సీఎంగా గెలిచిన‌ప్పుడు కూడా ఈ జిల్లాలో కాంగ్రెస్ మెజార్టీ సీట్లు గెలుచుకుంది. ఇక ప్ర‌స్తుతం అధికార టీఆర్ఎస్ తిరుగులేని విజ‌యాలు సాధిస్తున్నా కాంగ్రెస్ మాత్రం ఇక్క‌డ ఎమ్మెల్సీ సీటు గెలుచుకుని ఎన్నో సంచ‌ల‌నాల‌కు కార‌ణ‌మైంది. ప్ర‌స్తుతం ఈ జిల్లాలోనే టీ కాంగ్రెస్‌కు ఉద్దండులైన నాయ‌కులు అంద‌రూ ఉన్నారు. న‌ల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంక‌ట‌రెడ్డి, నాగార్జునా సాగ‌ర్ నుంచి జానారెడ్డి, హుజూర్‌న‌గ‌ర్ నుంచి ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి, […]

చంద్ర‌బాబుకు ముందు నుయ్యి.. వెన‌క గొయ్యి

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు `రిజ‌ర్వేష‌న్ల` అంశంలో త‌ల‌నొప్పులు త‌గ్గేలా క‌నిపించ‌డం లేదు. క‌ర‌వ‌మంటే క‌ప్ప‌కు కోపం విడ‌వ‌మంటే పాముకు కోపం అన్న చందంగా ప‌రిస్థితి ఉండటంతో ఏం చేయాలో తెలియ‌క సందిగ్థంలో ఉన్నారు. ఇప్ప‌టికే కాపు రిజర్వేష‌న్ల అంశంపై ఆందోళ‌న‌లు జరుగుతున్నా.. దానిని ఎలాగొలా అణిచివేస్తున్న చంద్ర‌బాబుకు.. ఇప్పుడు ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ అంశం ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా మారింది. మాల‌ల‌ను ద‌గ్గ‌ర చేసుకుంటే మాదిగ‌లు దూర‌మైపోతారు.. అదే స‌మ‌యంలో మాదిగ‌ల‌ను దూరం చేసుకుంటే వాళ్లంతా ఇత‌ర […]

ప్ర‌శాంత్ ప్ర‌భావం జ‌గ‌న్‌పై ప‌డిందిగా..

`నువ్వు మారాలి.. నీ వ్య‌వ‌హార శైలి మారాలి.. నీ మాట తీరు మారాలి` అంటూ పార్టీలో సీనియ‌ర్ నేత‌లు ఎంత‌మంది చెప్పినా ప‌ట్టించుకునే వారు కాదు వైసీపీ అధినేత,ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌!! నిన్న‌మొన్న‌టి వ‌రకూ టీడీపీ నేత‌లు కూడా ఆయ‌న వ్య‌వ‌హార‌శైలినే టార్గెట్ చేసేవారు!! ఇప్పుడు జ‌గ‌న్ నిజంగానే మారిపోయారు. ఇటీవ‌ల ఆయ‌న పాల్గొన్న సంఘ‌ట‌న‌లు, ఆయ‌న మాట‌తీరు గ‌మ‌నించి వారంతా ఇప్పుడు ఆశ్చర్య‌పోతున్నారు. దీని వెనుక ఏరికోరి తెచ్చుకున్న ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ ప్ర‌భావం […]

ఆంధ్ర‌జ్యోతి మాట‌ల్లో నీతులు.. రాతల్లో పైత్యాలు

టీడీపీని, ఆ పార్టీ అధినేత‌ను ఆకాశానికి ఎత్తేస్తూ.. భుజాల‌పై మోస్తోంది ఆంధ్ర‌జ్యోతి! టీడీపీకి అనుకూలంగా వార్త‌లు రాయ‌డంలో ఈనాడును కూడా మించిపోయింది. అయితే దీనిని ఎవ‌రూ త‌ప్పుప‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే ఎవ‌రి సొంత ప్ర‌యోజ‌నాలు వారివి! బాధ్య‌తాయుత‌మైన ప‌త్రిక‌గా ఉంటూ విలువ‌లు పాటించాల్సిన అవ‌స‌రం కూడా చాలా ముఖ్యం! ఇటీవ‌ల ఆ ప‌త్రిక‌లో వ‌స్తున్న వార్త‌లను ప‌రిశీలిస్తే.. విలువ‌ల‌కు తిలోద‌కాలు ఇచ్చినట్టేన‌ని అర్థ‌మ‌వు తుంది. ముఖ్యంగా సోష‌ల్ మీడియాలో ఎవ‌రో క‌ల్పించి రాసిన వాటి ఆధారంగా […]

టీటీడీపీ నేత‌ల‌తో ఏపీలో పార్టీకి న‌ష్టం

రెండు రాష్ట్రాల్లోనూ అధికార పార్టీ నాయ‌కులు ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌కు తెర‌తీయ‌డంతో.. జోరుగా ఎమ్మెల్యేలు అటు సైకిల్‌, ఇటు కారు ఎక్కేశారు. ముఖ్యంగా తెలంగాణ‌లో ఆప‌రేష‌ణ్ ఆక‌ర్ష్ దెబ్బ‌కు పూర్తిగా టీడీపీ ఖాళీ అయిపోయింది. దీనిపై టీటీడీపీ నేత‌లు టీఆర్ఎస్‌పై పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇక ఏపీలో ప‌రిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. తెలంగాణ‌లో ఫిరాయింపుల‌పై పోరాటం చేస్తుంటే… ఏపీలో మాత్రం ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హించి ప్ర‌తిప‌క్ష వైసీపీ ఎమ్మెల్యేల‌ను సైకిల్ ఎక్కించేసుకున్నారు. దీనిపై ఎక్కువ విమ‌ర్శ‌లు వినిపిస్తున్న‌తరుణంలో.. టీటీడీపీ […]

టార్గెట్ మోడీ: బాబును మించిపోయిన కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్ర‌ధాన‌మంద్రి న‌రేంద్ర‌మోడీపై ఎక్క‌డా లేని భ‌క్తిని చూపిస్తున్నారు. మోడీని ఆయ‌న పూర్తిగా ఆక‌ట్టేసుకున్న‌ట్టే కేసీఆర్ తాజా చ‌ర్య‌లు స్ప‌ష్టం చేస్తున్నాయి. ఎన్డీయే త‌ర‌పున రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ప‌నిచేస్తోన్న రామ్‌నాథ్ కోవింద్ దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఎన్డీయే మిత్ర‌ప‌క్షాలను క‌లుస్తూ మ‌ద్ద‌తు యాత్ర చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే మంగ‌ళ‌వారం ఆయ‌న రెండు తెలుగు రాష్ట్రాల్లోను ప‌ర్య‌టించారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌కు మిత్ర‌ప‌క్ష‌మైన టీడీపీ, తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్‌, ఏపీలోని విప‌క్ష వైసీపీ మ‌ద్ద‌తు […]